Chiranjeevi: ఇప్పుడు బెంగళూరులో.. రేపు ఎక్కడైనా: నీటి విలువపై చిరంజీవి పోస్ట్‌

బెంగళూరు నీటి సమస్యపై ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు.

Published : 26 Mar 2024 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సమస్య (Bengaluru Water Crisis) తలెత్తిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని జల సంక్షోభాన్ని అక్కడి వాసులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే నీటి విలువను గుర్తుచేస్తూ ప్రముఖ హీరో చిరంజీవి (Chiranjeevi) సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. నీటి సంరక్షణ (Conserve Water)ను దృష్టిలో పెట్టుకుని ఇంకుడు గుంతలు, చిన్నపాటి బావులు ఉండేలా ఇంటిని నిర్మించుకోవాలని పేర్కొన్నారు. బెంగళూరులోని తన ఫామ్‌హౌస్‌లోనూ అటువంటి నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. సంబంధిత ఫొటోలు షేర్‌ చేశారు.

‘‘నీరు జీవనాధారం. నీటి కొరత వల్ల రోజువారీ జీవితం కష్టతరమవుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి బెంగళూరులో నెలకొంది. రేపు ఇంకెక్కడైనా రావొచ్చు. అందుకే నీటి సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఇంటిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. నా ఫామ్‌హౌజ్‌లో పెర్మాకల్చర్‌ విధానాన్ని అమలు చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని