డ్రగ్స్ కేసు.. అనుమానాస్పద స్థితిలో నటుడి మృతి..!
ప్రముఖ నటుడు లీ సన్-క్యూన్( Lee Sun-kyun) మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సియోల్: ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘పారాసైట్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న దక్షిణ కొరియా నటుడు లీ సన్-క్యూన్( Lee Sun-kyun) అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకొన్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్లోని పార్క్లో నిలిపి ఉంచిన వాహనంలో ఆయన ఆపస్మారక స్థితిలో ఉండగా గుర్తించారు. ఆయన రాసినట్లు భావిస్తున్న ఒక సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
దక్షిణ కొరియాకు చెందిన లీ సన్-క్యూన్ వయస్సు 48 సంవత్సరాలు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రఖ్యాత కొరియన్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత 2001లో ‘లవర్స్’ అనే టీవీ షో ద్వారా తెరంగేట్రం చేశారు. ‘పారాసైట్’లో సంపన్నుడిగా నటించారు. 2019లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్ప్లే విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలను గెలుచుకుంది. లీ చివరగా ఈ ఏడాది ‘స్లీప్’ చిత్రంలో మెరిశారు. డ్రగ్స్ వాడిన కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. నటుడిగా ఎందరో అభిమానాన్ని చూరగొన్న ఆయన.. ఈ కేసు కారణంగా పలు ప్రాజెక్టులను కోల్పోయినట్లు సమాచారం.
అక్టోబర్లో డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా పోలీసు స్టేషన్కు వచ్చిన లీ సన్-క్యూన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న నా కుటుంబానికి క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు. అక్రమంగా డగ్స్ వినియోగించడాన్ని దక్షిణ కొరియాలో తీవ్రంగా పరిగణిస్తారు. విదేశాల్లో చట్టబద్ధంగా గంజాయి తీసుకున్నా సరే.. స్వదేశానికి వచ్చిన తర్వాత విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉన్నతమైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసొస్తున్నాయి
ఎదురు చూపులకి తెర పడింది. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఖరారైంది. మేలైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసి వస్తున్నాయంటూ జూన్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు శనివారం ప్రకటించాయి. -
ప్రేమ వివాహమే చేసుకుంటా!
‘జాతిరత్నాలు’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడామె అల్లరి నరేశ్తో కలిసి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’తో అలరించేందుకు సిద్ధమైంది. -
కృష్ణ జయంతికి ‘హరోం హర’
‘హరోం హర’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. -
‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు
ప్రభుదేవా - శంకర్ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని మే 1న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు రమణ, మురళీధర్ రెడ్డి ప్రకటించారు. -
ఆ లాజిక్తోనే ప్రసన్న వదనం తీశాడు
‘‘నేను తీసిన ‘100%లవ్’ మొదలుకొని నా ప్రతి సినిమాకీ పనిచేశాడు అర్జున్. తను హాలీవుడ్లో ఉండి ఉంటే మరో స్థాయిలో సినిమాలు తీసేవాడు. -
ఈసారి శివాలెత్తిపోద్ది
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. దీని గురించి నేనొక్కటే చెప్తాను. ఈసారి శివాలెత్తిపోద్ది’’ అన్నారు విష్వక్ సేన్. ఆయన హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. -
మూడు జంటల కథ.. ఖేల్ ఖేల్ మే
వినోదాన్ని పంచే ఏ సినిమా కోసమైనా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ జాబితాలోకే చేరే ‘ఖేల్ ఖేల్ మే’ కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు వినిపించింది చిత్రబృందం. -
అవి నా జీవితంలో చీకటి రోజులు!
‘‘నా జీవితంలోనే నేను అనుభవించిన ఓ చీకటి దశ ఇద’’ని అంటోంది నాయిక ప్రియాంక చోప్రా. బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. -
తండ్రీ తనయుల సంఘర్షణ
తన కొడుకు ప్రయోజకుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన ఓ తండ్రి... ‘నాన్నలందరూ ఇంతే, అర్థం చేసుకోర’ంటూ బాధపడే ఓ తనయుడు... -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..