Nikhil: ఆ మ్యాచ్‌ చూసి నిఖిల్‌ అసహనం.. ట్వీట్‌ వైరల్‌

క్రీడల పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు నటుడు నిఖిల్‌ (Nikhil). తాజాగా ఆయన ఓ మ్యాచ్‌ చూసి అసహనం వ్యక్తం చేశారు.

Published : 23 Mar 2024 10:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫుట్‌బాల్‌ అంటే నిఖిల్‌కు ఇష్టం. ఆ మ్యాచ్‌లను తరచూ ఫాలో అవుతుంటారు. సౌదీ అరేబియా వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ఆసియా క్వాలిఫయర్స్‌లో ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ ప్రదర్శన పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్‌ నుంచి మన జట్టు ఒక్క గోల్‌ కూడా కొట్టకపోవడం ఏం బాలేదన్నారు.

‘‘ఫిఫా వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో మన జట్టు ప్రదర్శన నిరాశకు గురి చేసింది. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అత్యధిక జనాభా ఉన్న దేశంగా మరెంతో సాధించాలి. మన జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో గతేడాది జరిగిన ఖతార్‌ మ్యాచ్‌ (ఖతార్‌ 3 గోల్స్‌ చేయగా.. భారత్‌ ఒక్క గోల్‌ కూడా చేయలేదు) తెలియజేస్తుంది. నవంబర్‌ నుంచి మన జట్టు ఒక్క గోల్‌ కూడా చేయకపోవడం బాధాకరం. సంక్షుభిత దేశమైన అఫ్గానిస్థాన్‌ జట్టునూ ఓడించలేకపోయాం. టీమ్‌ను పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ అంటూ కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

నిఖిల్‌ నటించిన ‘స్పై’ గతేడాది విడుదలై మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన ‘స్వయంభు’ కోసం వర్క్‌ చేస్తున్నారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సంయుక్త కథానాయిక. ఇటీవల ‘కార్తికేయ 3’ అనౌన్స్‌ చేశారు. చందు మొండేటి దర్శకుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని