Natasha Doshi: గ్రాండ్‌గా హీరోయిన్‌ నటాషా వివాహం.. నెల తర్వాత పోస్ట్‌!

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘జై సింహా’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ నటాషా దోషి. ఇటీవల ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

Published : 04 Mar 2024 01:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ నటాషా దోషి (Natasha Doshi) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వ్యాపార వేత్త మనన్‌ షాను పెళ్లి చేసుకున్నారు. తమ వెడ్డింగ్‌ జనవరి 31న జరగ్గా అభిమానులతో ఆ శుభవార్తను ఆదివారం పంచుకుని నటాషా సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘నువ్వు పరిచయమైన క్షణం ఈ ప్రపంచమంతా నా సొంతమైనట్లు అనిపించింది’ అంటూ తన భర్తను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ఫొటోలు షేర్‌ చేశారు. తమ పెళ్లి ఎక్కడ జరిగిందనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ముంబయికి చెందిన నటాషా 2012లో మలయాళ చిత్రం ‘మాంత్రికన్‌’తో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత మరో మూడు మలయాళ సినిమాల్లో నటించారు. 2018లో వచ్చిన బాలకృష్ణ చిత్రం ‘జై సింహా’ (Jai Simha)తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. శ్రీకాంత్‌ సరసన ‘కోతల రాయుడు’లో సందడి చేశారు. 2020లో కల్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన ‘ఎంత మంచి వాడవురా’ (Entha Manchivaadavuraa)లో ప్రత్యేక గీతంలో కనిపించి ఆకట్టుకున్నారు. తర్వాత నటనకు దూరమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని