Neha shetty: ఆ పాత్రది ప్రత్యేక స్థానం
‘డీజే టిల్లు’ నుంచి జోరు చూపిస్తున్న కథానాయిక... నేహాశెట్టి. ఆ సినిమాతో రాధికగా కుర్రాళ్ల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిందామె. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం కోసం విష్వక్సేన్తో జోడీ కట్టింది.
‘డీజే టిల్లు’ నుంచి జోరు చూపిస్తున్న కథానాయిక... నేహాశెట్టి. ఆ సినిమాతో రాధికగా కుర్రాళ్ల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిందామె. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం కోసం విష్వక్సేన్తో జోడీ కట్టింది. ఇందులో ఆమె బుజ్జి పాత్రతో సందడి చేయబోతోంది. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా నేహాశెట్టి సోమవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...
‘డీజే టిల్లు’ తర్వాత నుంచి చీరకట్టుతో కనిపించే పాత్రలతోనే ఎక్కువగా నటిస్తున్నారు... ?
అలాంటి పాత్రల్నే ఎంచుకుంటున్నానా? లేక అలాంటివే నా దగ్గరికి వస్తున్నాయా? (నవ్వుతూ). ఆలోచిస్తే నా దగ్గరికి వస్తున్న పాత్రలే అలా ఉంటున్నాయని అర్థమవుతోంది. చిన్న వయసులోనే పరిశ్రమకి వచ్చాను కదా... తొలినాళ్లల్లో చీరకట్టుపై అవగాహనే ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం చీర నాకు సౌకర్యంగా అనిపిస్తోంది. అయితే నా తదుపరి సినిమాలో మాత్రం మోడ్రన్ అమ్మాయిగానే కనిపిస్తా.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో మీరు పోషించిన బుజ్జి పాత్ర సంగతులేమిటి?
90వ దశకం నేపథ్యంలో సాగే కథ ఇది. నేను ఆ కాలంనాటి ధనవంతుల కుటుంబానికి చెందిన ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా. అందంగా కనిపిస్తూనే, ధృఢమైన మనస్తత్వమున్న అమ్మాయి బుజ్జి. ట్రైలర్లో చూస్తే అందంగా, సౌమ్యంగానే కనిపిస్తుంది. కానీ ఒక అమ్మాయిలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో అవన్నీ బుజ్జి పాత్రలో కనిపిస్తాయి. చాలా శక్తిమంతమైన పాత్ర. సినిమాలో ఆ పాత్ర చుట్టూ ఆశ్చర్యకరమైన విషయాలు చాలానే ఉంటాయి.
90లనాటి కథ, పాత్రలు కదా. మరి బుజ్జి పాత్ర కోసం ఎలా సన్నద్ధమయ్యారు?
అప్పటి సినిమాల్లో కథానాయికలు, ముఖ్యంగా శోభన లుక్నీ, ఆమె నటననీ సూచించారు మా దర్శకుడు. అప్పటి పరిస్థితులకి తగ్గట్టుగా నా ఆహార్యాన్ని మార్చుకుని, అప్పటి కథానాయికల్లాగా కళ్లతోనే హావభావాలు పలికించే ప్రయత్నం చేశా. యాస పరంగా మాత్రం పెద్దగా సన్నద్ధం కావల్సిన అవసరం రాలేదు.
‘డీజే టిల్లు’ తర్వాత నుంచి మీరు కనిపిస్తే రాధిక అనే పిలుస్తారు. అది మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది?
దాన్ని గౌరవంగానే భావిస్తా. మనం పోషించిన పాత్ర పేరుతో మనల్ని పిలవడం అనేది ఏ నటులకైనా ఓ గొప్ప ప్రశంస కదా. షారుక్ఖాన్ని బాద్షా అని పిలిచినంత ఆనందంగా ఉంటుంది నన్ను రాధిక అని పిలిస్తే! ప్రేక్షకుల హృదయాల్లో ఆ పాత్ర అంతటి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
తదుపరి సినిమాల కబుర్లేమిటి?
బెల్లంకొండ శ్రీనివాస్తో కలిసి ఓ సినిమా చేస్తున్నా. అందులో మోడ్రన్ అమ్మాయిగా కనిపిస్తా. కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూస్తున్న విధానం మారిపోయింది. వాళ్ల ఆలోచనలకి తగ్గట్టుగానే ఆచితూచి కథల్ని ఎంపిక చేసుకుంటూ, ప్రయాణం చేస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?