Adipurush: ‘ఆదిపురుష్’లో మార్పులు
‘ఆదిపురుష్’ ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలిరోజు నుంచే నెట్టింట రకరకాల విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సినిమాలో హనుమంతుడి పాత్రకు సంబంధించిన కొన్ని సంభాషణలు.. మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
‘ఆదిపురుష్’ (Adipurush) ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలిరోజు నుంచే నెట్టింట రకరకాల విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సినిమాలో హనుమంతుడి పాత్రకు సంబంధించిన కొన్ని సంభాషణలు.. మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆ చిత్ర మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా వివరణ ఇచ్చినా.. విమర్శలు ఆగకపోవడంతో ‘ఆదిపురుష్’లోని ఆ కొన్ని సంభాషణల్ని మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా ఓ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు. ‘‘ప్రతి ఒక్కరి భావోద్వేగాల్ని గౌరవించడం రామకథ నుంచి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం అని నా అభిప్రాయం. ‘ఆదిపురుష్’ కోసం నేను 4 వేల లైన్లకు పైగా డైలాగులు రాశాను. వాటిలో 5 లైన్లు కొందరిని బాగా బాధించాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీరాముడిని, సీతమ్మను కీర్తిస్తూ చాలా సంభాషణలున్నాయి. కానీ, వాటి కంటే ఈ కొన్ని మాటలే ఎక్కువ ప్రభావం చూపాయనిపిస్తోంది. 3 గంటల సినిమాలో 3 నిమిషాలు మీ ఊహకు భిన్నంగా రాశానని నాపై సనాతన ద్రోహి అని ముద్ర వేశారు. ఈ చిత్రంలో ఉన్న ‘జై శ్రీరాం’, ‘శివోహం’, ‘రామ్ సీతారామ్’ వంటి గొప్ప పాటలు నా కలం నుంచి పుట్టినవే. మీరు ఇవేమీ చూడకుండా నాపై నింద వేయడంలో తొందరపడ్డారు అనుకుంటున్నా. నన్ను నిందించిన వారిపై నాకెలాంటి ఫిర్యాదులు లేవు. మేము సనాతన సేవ కోసం ఈ సినిమా తీశాం. అందరూ ‘ఆదిపురుష్’ను ఎంతో ఆదరిస్తున్నారు. భవిష్యత్తులోనూ మీ ప్రేమాభిమానాలు ఇలాగే ఉంటాయని ఆశిస్తున్నాను. మాకు ప్రేక్షకుల మనోభావాలు ముఖ్యం. అందుకే చిత్ర బృందం అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మీకు బాధ కలిగించిన డైలాగులను మారుస్తున్నాం. ఒక వారంలో ఈ మార్పును చేయనున్నాం. అందరి సూచనలను గౌరవిస్తున్నాం’’ అని ట్విటర్ వేదికగా తెలియజేశారు. ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కించారు. జానకిగా కృతి సనన్ నటించగా.. లంకేశుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించారు. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.240కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.