Aishwarya Rajinikanth: ‘కొలవెరి’ సక్సెస్‌ కొంపముంచింది.. ‘3’ ఫెయిల్యూర్‌పై ఐశ్వర్య రజనీకాంత్‌

‘లాల్‌ సలాం’ విడుదల సమయంలో ఇచ్చిన ఇంటర్య్వూలో దర్శకురాలు ఐశ్వర్య ‘3’ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 12 Feb 2024 18:55 IST

ఇంటర్నెట్‌ డెస్క: ధనుష్‌, శ్రుతి హాసన్‌ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘3’. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth) తెరకెక్కించారు. ఇందులోని ‘వై దిస్‌ కొలవరి’ పాటకు విపరీతమైన క్రేజ్‌ వచ్చిందన్నారు. ‘లాల్‌ సలాం’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.

‘‘3’ సీరియస్‌ ప్రేమకథగా రూపొందించాలనుకున్నా. దానిని ‘వై దిస్‌ కొలవరి’ పాట మార్చేసింది. ఆ స్థాయి స్పందన మేము ఊహించలేదు. దీంతో సినిమా మేకింగ్‌ విషయంలో మాపై ఒత్తిడి పెరిగింది. సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టించిన ఆ పాట ఆ తర్వాత ఏ విధంగానూ ఉపయోగపడలేదు. అలా జరుగుతుందని నేను అప్పుడు ఊహించలేదు. దానిని అంగీకరించడానికి కష్టంగా ఉన్నా, చాలా మంది వారి జీవితానికి ఆ పాటను ఆపాదించుకుంటూ ఆదరించారు. అందుకు సంతోషంగా ఉంది. మొదటిసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు ఎవరూ స్పందించలేదు. రీ-రిలీజ్‌, టీవీలో టెలికాస్ట్‌ అయిన తర్వాత నాకు చాలా మంది ఫోన్‌లు చేశారు’’ అని తెలిపారు.  ఈ చిత్రంలోని పాటలు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అనిరుధ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఐశ్వర్య తాజాగా రజనీకాంత్‌ కీలక పాత్రలో ‘లాల్‌ సలాం’ తీయగా, తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో ధనుష్‌ నటించిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రభాస్‌  ‘సలార్‌’తో శ్రుతిహాసన్‌ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని