Ajay devgn: ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా ఎనిమిది సీక్వెల్స్తో వస్తున్న హీరో
బాలీవుడ్ నటుడు అజయ్ క్రేజీ ఫీట్ చేయబోతున్నారు. ఆయన తర్వాత నటించబోయే సినిమాలన్నీ సీక్వెల్స్ కావడం గమనార్హం
హైదరాబాద్: సాధారణంగా ఇండస్ట్రీలో హిట్ మూవీలకే సీక్వెల్స్, ఫ్రాంఛైజీలు వస్తాయి. మొదటిభాగం హిట్ అయ్యిందంటే, తర్వాత వచ్చే చిత్రాలపై అంచనాలు భారీగా ఉంటాయి. ఒక పక్క హీరోగా చేస్తూనే మరోవైపు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ (Ajay Devgn). హిందీ నటుడిగా తెలుగు వారికి తెలిసినా, ‘RRR’తో మరింత దగ్గరయ్యారు. అజయ్ ఇప్పుడు బాలీవుడ్లో క్రేజీ ఫీట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఒకటీ, రెండూ కాదు ఏకంగా ఎనిమిది సీక్వెల్స్లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన తర్వాతి సినిమాల జాబితాలో ఉన్నవి ఎక్కువగా సీక్వెల్స్ కావడం గమనార్హం.
ఈ ఏడాది ‘షైతాన్’ (Shaitaan) మూవీతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన త్వరలోనే ‘మైదాన్’ (Maidaan) తోనూ అలరించేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత ఆయన నటించే చిత్రాలన్నీ దాదాపు సీక్వెల్సే. రాజ్కుమార్ గుప్త దర్శకత్వంలో ‘రైడ్’ మూవీ కొనసాగింపుగా ‘రైడ్ 2’ రాబోతోంది. వాణీకపూర్, రితేశ్ దేశ్ముఖ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సింగం అగైన్’ ఇప్పటికే సెట్స్పై ఉంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఢమాల్ 4’, ‘గోల్మాల్-5’లకు సంబంధించి కూడా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. రకుల్ప్రీత్సింగ్తో కలిసి ‘దే దే ప్యార్ దే-2’ రాబోతోంది. ఇందులో వయసు అంతరం ఉన్న ప్రేమికుడిగా మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘సన్ ఆఫ్ సర్దార్’కు కొనసాగింపుగా మరో మూవీ పట్టాలెక్కనుంది. వర్తమానంలో జరిగే కథతో ఇది ప్రేక్షకుల ముందుకురానుందని బాలీవుడ్ టాక్. ఆల్టైమ్ బ్లాక్బస్టర్ ‘దృశ్యం’ మూవీలకు కొనసాగింపుగా ‘దృశ్యం 3’ని దర్శకుడు జీతూ జోసెఫ్ రెడీ చేస్తున్నారు. అక్కడ స్క్రిప్ట్ పనులు పూర్తయిన వెంటనే అజయ్ బాలీవుడ్లోనూ షురూ చేస్తారు.
ఇక లేటెస్ట్ హిట్ ‘షైతాన్’కు కొనసాగింపుగా ‘షైతాన్ 2’ను కూడా తీసుకురావాలని అజయ్ భావిస్తున్నారట. ఇటీవల ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని చెప్పారు. అయితే, ఇది ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అనుకున్న మూవీలు పూర్తయిన తర్వాతే దీన్ని తీసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ‘షైతాన్’కు అజయ్ దేవ్గణ్ నిర్మాతల్లో ఒకరు కావడం గమనార్హం. ఈసారి మాధవన్ పాత్రను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తారట. అమిత్శర్మ దర్శకత్వంలో అజయ్ నటించిన తాజా చిత్రం ‘మైదాన్’ రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఐదేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకొన్న ఈ మూవీలో ప్రియమణి, గజరాజ్రావ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్గా దీన్ని రూపొందించారు. అజయ్ ఇందులో ఫుట్బాల్ కోచ్గా కనిపించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఐడెంటిటీ మార్చుకోవాల్సి వస్తే: విజయ్ ఆంటోనీ సమాధానమేంటంటే?
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తుఫాన్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. -
నిహారిక ధైర్యాన్ని మెచ్చుకోవాలి : సిద్ధూ జొన్నలగడ్డ
‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. -
‘దేవర’ సాంగ్ అప్డేట్ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. ఏమన్నారంటే?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమా సాంగ్ అప్డేట్ ఇచ్చారు శేఖర్ మాస్టర్. -
నిజమైన సింహంతో ఫస్ట్ ఆసియా ఫిల్మ్.. ‘మాంబో’!
‘అరణ్య’తో అలరించిన దర్శకుడు ప్రభు సాల్మన్ మరో సరికొత్త ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. -
తనే నిజం చెబితే బాగుంటుంది: రాజ్ తరుణ్ ఇష్యూపై డైరెక్టర్ రవికుమార్
రాజ్ తరుణ్ ఇష్యూపై దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ స్పందించారు. రాజ్ తరుణ్ హీరోగా రవికుమార్ తెరకెక్కించిన చిత్రం ‘తిరగబడర సామీ’ త్వరలోనే విడుదల కానుంది. -
అందుకే రాజ్ తరుణ్ను హీరోగా తీసుకున్నా: ‘పురుషోత్తముడు’ డైరెక్టర్
రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన తెరకెక్కించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ప్రచారంలో భాగంగా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
రాజ్తరుణ్ వల్ల ‘పురుషోత్తముడు’ బిజినెస్ లాస్ అయిందా?.. నిర్మాత ఏమన్నారంటే!
‘పురుషోత్తముడు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. రాజ్తరుణ్ వల్ల సినిమా బిజినెస్ లాస్ అయిందా?అనే ప్రశ్నకు నిర్మాత రమేశ్ సమాధానమిచ్చారు. -
‘రాజాసాబ్’పై తమన్ ఆసక్తికర కామెంట్స్.. ఏం అప్డేట్ ఇచ్చారంటే?
ప్రభాస్ ‘రాజాసాబ్’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. -
లీక్స్పై స్పందించిన ‘వీడీ 12’ టీమ్.. సోషల్ మీడియాలో పోస్ట్
లీక్స్ రావడంపై ‘వీడీ 12’ టీమ్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. -
అది చిన్న విషయం కాదు: ‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్పై పూరి జగన్నాథ్
తన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’లోని ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రత్యేకంగా మాట్లాడారు. -
హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా?: ప్రశ్నించిన అనిల్ రావిపూడి
హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా? అని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశ్నించారు. ఏం జరిగిందంటే? -
ఎన్టీఆర్పై ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రశంసలు: ‘దేవర’ సాంగ్ గురించి ఏమన్నారంటే?
టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్పై కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. -
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబో.. సర్ప్రైజ్ అదిరింది
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘సూర్య 44’ (వర్కింగ్ టైటిల్). సూర్య పుట్టినరోజు సందర్భంగా టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది. -
వీటి ఆధారంగా ‘కల్కి’ రెండు భాగాలు: ఫొటో పంచుకున్న నాగ్ అశ్విన్
‘కల్కి 2898 ఏడీ’ సినిమాకి సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఫొటో పోస్ట్ చేశారు. -
ఆర్ఆర్ఆర్ను బీట్ చేసిన కల్కి 2898 ఏడీ.. వసూళ్లు ఎంతంటే?
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లను అధిగమించింది. -
రెండు సినిమాల అప్డేట్స్ చెప్పిన రజనీకాంత్.. ‘ఇండియన్ 2’ గురించి ఏమన్నారంటే!
తన అప్కమింగ్ సినిమాల అప్డేట్లను రజనీకాంత్ పంచుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఈ వారం థియేటర్లో వినోదాల విందు.. మరి ఓటీటీలో..!
‘కల్కి’ తర్వాత వచ్చిన చిత్రాలేవీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. జులై చివరిలో మరికొన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరి థియేటర్తో పాటు ఓటీటీలో వస్తున్న ఆ చిత్రాలేంటో చూసేయండి. -
రీమేక్ అంటూ నెటిజన్ కామెంట్: స్పందించిన హరీశ్ శంకర్
తన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’పై ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. హరీశ్ శంకర్ స్పందించారు. -
‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అప్పుడే.. దిల్ రాజు ప్రకటన
‘గేమ్ ఛేంజర్’ విడుదలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఏమన్నారంటే? -
ధనుష్ ఇచ్చిన ఛాన్స్.. అదే నాకు అవార్డు: సందీప్ కిషన్ ఎమోషనల్ స్పీచ్
‘రాయన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ ఎమోషనల్గా మాట్లాడారు. ధనుష్పై ప్రశంసలు కురిపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ