Ajith: స్నేహితులకు బిర్యానీ వండిన స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

వర్క్‌ లైఫ్‌ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకున్నారు నటుడు అజిత్ (Ajith). తాజాగా ఆయన బిర్యానీ వండారు. 

Updated : 30 Mar 2024 14:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వర్క్‌ లైఫ్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నారు కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అజిత్‌ (Ajith). ఫ్రీ టైమ్‌ను ఎంజాయ్‌ చేయడం కోసం తన స్నేహితులతో కలిసి కొన్నిరోజుల క్రితం మధ్యప్రదేశ్‌ వెళ్లారు. ఇందులో భాగంగా గరిటె చేతపట్టారు. ఫ్రెండ్స్‌ కోసం ప్రత్యేకంగా బిర్యానీ వండిపెట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన పలువురు అభిమానులు.. ‘‘కుకింగ్‌లోనూ అజిత్‌ స్టైల్‌ కనిపిస్తుంది’’, ‘‘ఇలాంటి సీన్‌ సినిమాల్లో ఉంటే భలే ఉంటుంది’’ అని మాట్లాడుకుంటున్నారు.

సినిమాల విషయానికి వస్తే.. గతేడాది ‘తునివు’తో అజిత్‌ ప్రేక్షకులను అలరించారు. ఇందులో డార్క్‌ డెవిల్‌ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ‘విదా ముయార్చీ’ కోసం వర్క్‌ చేస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష కథానాయిక. ఎన్నో అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. అజర్‌బైజాన్‌లో ఇటీవల కొంత షూట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చాక ‘విదా ముయార్చీ’ షూట్‌లో పాల్గొననున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని