Adipurush: ‘ఆదిపురుష్’ చిత్రబృందానికి అలహాబాద్ హైకోర్టు సమన్లు
ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ చిత్రం విడుదలైనప్పటి నుంచి పలు విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది.
ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రం విడుదలైనప్పటి నుంచి పలు విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా ఆదిపురుష్ చిత్రబృందానికి అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. జులై 27న చిత్రబృందం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను శుక్రవారం హైకోర్టు తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అందులో దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కూమార్, డైలాగ్ రైటర్ మనోజ్ మంతాషిర్ను కోర్టులో హాజరు కావాలని తెలిపింది. ఈ చిత్రం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందా లేదా అన్న విషయాన్ని సమీక్షించి.. తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి అలహాబాద్ హైకోర్టు సూచించింది. అంతే కాకుండా ఈ సినిమాకు సర్టిఫికెట్ మంజూరు చేసిన నిర్ణయాన్ని కూడా సమీక్షించాల్సిందిగా ప్రభుత్వానికి నిర్దేశించింది. కుల్దీప్ తివారీ, నవీన్ ధావన్ వేసిన వేర్వేరు పిటిషన్లను.. జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్, జస్టిస్ శ్రీ ప్రకాష్ సింగ్తో కూడిన ఓ వెకేషన్ బెంచ్ విచారించింది. ఈ క్రమంలో సినిమా ప్రసారం కోసం సినిమా సర్టిఫికేషన్కు సంబంధించిన మార్గదర్శకాలను పాటించారా అనే విషయానికి వివరణ ఇచ్చేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఛైర్మన్లు తమ వ్యక్తిగత అఫిడవిట్లను దాఖలు చేయాలని బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణ తేదీలోగా అవసరమైన అఫిడవిట్లను దాఖలు చేయని పక్షంలో.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీ కంటే తక్కువ స్థాయిలో లేని క్లాస్-1 అధికారితో పాటు సీబీఎఫ్సీకి చెందిన ఓ అధికారి రికార్డులతో సహా కోర్టులో హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆదిపురుష్ దర్శకుడు, రచయిత అలాగే నిర్మాతలు.. విచారణ తేదీలోగా వ్యక్తిగత అఫిడవిట్లను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అఫిడవిట్లు వచ్చే వరకు చిత్రబృందం సభ్యులపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసింది.
ఈటీవీ భారత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్లో సెట్లోకి
గతేడాది బ్లాక్బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.