Chiranjeevi: పవన్‌కల్యాణ్‌ టు శిరీష్‌.. ఆయనే బాట వేశారు: అల్లు అరవింద్‌

సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌కు చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన్ని ఉద్దేశించి అల్లు అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 23 Mar 2024 12:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. అగ్ర కథానాయకుడు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిరంజీవికి పద్మవిభూషణ్‌ వచ్చినందుకుగాను సినీ ప్రముఖులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. చిరు గురించి నిర్మాత అల్లు అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబం నుంచి ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు బాట వేసింది ఆయనేనన్నారు. ‘‘పవన్‌కల్యాణ్‌ నుంచి అల్లు శిరీష్‌ వరకూ.. అందరూ ఆయన వేసిన బాటలో నడుస్తూ సినీ పరిశ్రమలో కెరీర్‌ నిర్మించుకున్నారు. అంత పెద్ద రహదారి వేశారాయన’’ అని అన్నారు. ఎంతో మంది యువ నటీనటులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారన్నారు. చిరంజీవి సినీ కెరీర్‌, ఆయన ఎదుర్కొన్న సవాళ్లపైనా మాట్లాడారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఆహా సంస్థలు సంయుక్తంగా సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ని నిర్వహించాయి. శుక్రవారం ఉదయం జరిగిన చర్చా కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు, విమర్శకులు, విశ్లేషకులు పాల్గొన్నారు. నిర్మాత స్వప్న దత్‌, ఎస్‌కేఎన్‌, సుస్మితా కొణిదెల, ఆనంద్‌ దేవరకొండ తదితరులు పాల్గొని.. తమ తదుపరి చిత్రాల విశేషాలు పంచుకున్నారు. సినీ రంగంలో వస్తోన్న మార్పులపై అభిప్రాయాలు తెలియజేశారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో యువ నటీనటులు సందడి చేశారు. తేజ సజ్జా డ్యాన్స్‌తో అలరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని