Venkatesh: ముహూర్తం కుదిరింది

ఈ సంక్రాంతికి ‘సైంధవ్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు వెంకటేశ్‌. ఇప్పుడాయన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఆయన ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

Updated : 03 Apr 2024 14:05 IST

సంక్రాంతికి ‘సైంధవ్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు వెంకటేశ్‌. ఇప్పుడాయన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఆయన ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘ఎఫ్‌2’, ‘ఎఫ్‌3’ సినిమాల తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రమిది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలు కానుందని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు తెలిసింది. ఇక రెగ్యులర్‌ చిత్రీకరణ జూన్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌, వినోదంతో నిండి ఉన్న కుటుంబ కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇందులో వెంకీకి జోడీగా ఇద్దరు కథానాయికలు కనిపించనుండగా.. ఓ పాత్ర కోసం మీనాక్షి చౌదరిని ఖరారు చేశారని టాక్‌. ఈ చిత్రం కోసం ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు పరిశీలనలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని