Agent: ‘ఏజెంట్‌’ ఓటీటీ రిలీజ్‌పై నెటిజన్‌ పోస్ట్‌.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

అఖిల్‌ నటించిన ‘ఏజెంట్‌’ ఓటీటీ విడుదలపై నిర్మాత మరోసారి స్పందించారు.

Published : 09 Apr 2024 16:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్కినేని యంగ్‌ హీరో అఖిల్‌ (Akhil) నటించిన చిత్రం ‘ఏజెంట్‌’(Agent). ఈ సినిమా వచ్చి ఏడాది అవుతోంది. ఇంకా ఇది ఓటీటీలోకి రాకపోవడంతో కొందరు నెటిజన్లు మూవీ టీమ్‌ను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాత దీనిపై స్పందించారు. అనిల్‌ సుంకర తాజాగా ‘ఏజెంట్’ ఓటీటీ విడుదలపై కామెంట్స్‌ చేశారు. ‘ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీలివ్‌ కొనుగోలు చేసింది. ఇప్పటికే ఈవిషయాన్ని చాలాసార్లు చెప్పాను. అతి త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశముంది’ అని తెలిపారు. మొదట ఈ సినిమాను గతేడాది మే 19న ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. అఖిల్‌ రిక్కీ అలియాస్‌ రామకృష్ణ పాత్రలో కనిపించిన ఈ  స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లో ఆయన సరసన సాక్షి వైద్య నటించింది.   ప్రముఖ కథానాయకుడు మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో నటించారు.

ఇక ఈ చిత్రం తర్వాత అఖిల్‌ అధికారికంగా ఏ ప్రాజెక్టునూ ప్రకటించలేదు. ఈ క్రమంలోనే ఆయన తదుపరి సినిమా ఎవరితో చేస్తారో..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన కోలీవుడ్‌ దర్శకుడు లింగుస్వామితో కలిసి సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్‌.. ఇప్పటికే లింగుస్వామి కథకు ఓకే చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఇది పట్టాలెక్కనుందని అంటున్నారు. అలాగే కొత్త దర్శకుడితో ఈ యంగ్ హీరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో రూపొందనున్నట్టు సమాచారం. అనిల్‌ కుమార్‌ అనే ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘ధీర’ అనే పేరు కూడా ప్రచారంలో ఉంది. ఫాంటసీ కథతో రూపొందనున్నట్లు టాక్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని