Mahaveerudu: వీరుడు... బంగారుపేటలోన

శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా... మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మహావీరుడు’. ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితి శంకర్‌ కథానాయిక. అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు.

Updated : 23 Jun 2023 07:25 IST

శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా... మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మహావీరుడు’. ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితి శంకర్‌ కథానాయిక. అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. భరత్‌ శంకర్‌ స్వరకర్త. ‘బంగారు పేటలోన...’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటని ఇటీవలే విడుదల చేశారు. భరత్‌ శంకర్‌తో కలిసి అదితి శంకర్‌ ఆలపించిన ఈ పాటని రెహమాన్‌ రచించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో జులై 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘‘యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. శివ కార్తికేయన్‌, అదితి మధ్య కెమిస్ట్రీ అందంగా ఉంటుంది. ఇంటిల్లిపాదినీ అలరించే అంశాలు సినిమాలో ఉంటాయ’’ని సినీ వర్గాలు తెలిపాయి. యోగిబాబు, సునీల్‌, మిస్కిన్‌, సరిత తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విధు అయ్యన్న.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని