The Diary of West Bengal: మొన్నటివరకు ‘ది కేరళ స్టోరీ’.. ఇప్పుడు ‘ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ వివాదం
తాజాగా విడుదలైన ఓ చిత్ర ట్రైలర్పై పశ్చిమ్ బెంగాల్(West Bengal) ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంటనే ఆ దర్శకుడిపై చర్యలు ప్రారంభించింది. ఇంతకీ విషయం ఏంటంటే..?
కోల్కతా: ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story)సినిమా వివాదం సద్దుమణగక ముందే మరో సినిమాపై రగడ మొదలైంది. ఈసారి అందుకు పశ్చిమ్ బెంగాల్(West Bengal) వేదికైంది. అక్కడి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ‘ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్’(The Diary of West Bengal) ట్రైలర్ విడుదలైంది. ఇది బెంగాల్ ప్రభుత్వ ఆగ్రహానికి దారితీసింది. దాంతో దర్శకుడిపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఆ చిత్రం ద్వారా రాష్ట్రం పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులు మిశ్రాకు నోటీసులు జారీ చేశారు. పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పరిణామాలపై భాజపా తీవ్రంగా స్పందించింది.
‘‘ది కేరళ స్టోరీ’ని నిషేధించాలని విఫలయత్నం చేసిన బెంగాల్.. ఇప్పుడు ‘ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ చిత్ర నిర్మాత, దర్శకుడిని అణచివేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్లో చూపించినవి అక్కడి ప్రజల ప్రత్యక్ష అనుభవాలు. భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే చర్యలను మమతా బెనర్జీ మానుకోవాలి. ఆమె విలువలు లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజలు టీఎంసీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు’ అని భాజపా నేత అమిత్ మాలవీయ విమర్శలు గుప్పించారు.
ఇప్పటికీ ఇంకా ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story) సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేరళలో కొన్నేళ్లుగా కొందరు మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో దీన్ని రూపొందించగా.. ఈ చిత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని బెంగాల్ దాని విడుదలను అడ్డుకుంది. దానిని నిషేధిస్తూ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా.. ఆ నిషేధంపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదాల మధ్యనే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం దూసుకెళ్తోంది. ఇక ప్రస్తుతం డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ట్రైలర్లో చూపించిన ఘటనలను మమత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.
ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ చిత్రదర్శకుడు సనోజ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘రాష్ట్రం పరువుకు భంగం కలిగించాలనేది మా ఉద్దేశం కాదు. ఎంతో పరిశోధన చేసి, మేం వాస్తవాలను మాత్రమే చూపించాం. సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తికాలేదు. వచ్చేనెల మేం దీనిని సెన్సార్ బోర్డుకు సమర్పించే అవకాశం ఉంది’ అని తెలిపారు. జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి.. ఈ సినిమాకు కథను అందించారు. నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన అసలు పేరు వసీం రిజ్వి. ఉత్తర్ప్రదేశ్లోని షియా వక్ఫ్ బోర్డుకు గతంలో ఛైర్మన్గా పనిచేశారు. 2021 డిసెంబర్లో ఆయన హిందూమతంలోకి మారి జితేంద్రగా పేరు మార్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..