Bhimaa: ఓటీటీలోకి ‘భీమా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

‘భీమా’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. 

Published : 10 Apr 2024 12:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గోపిచంద్‌ హీరోగా ఎ.హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమా’. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో గోపిచంద్‌ డబుల్‌ యాక్షన్‌తో ఆకట్టుకున్నారు. ఇది ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికపై ఏప్రిల్ 25 నుంచి ప్రసారం కానుంది. ప్రియాంక భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా అలరించిన ఇందులో వెన్నెల కిషోర్‌, రఘుబాబు, నాజర్‌, నరేష్‌ కీలకపాత్రల్లో నటించారు.

క‌థేంటంటే: స్థ‌ల‌పురాణం ఉన్న మ‌హేంద్ర‌గిరిలో జ‌రిగే క‌థ ఇది. ప‌ర‌శురామ క్షేత్రం కొలువైన ఆ ప్రాంతంలో భ‌వానీ (ముఖేష్ తివారి) ముఠా ఎన్నెన్నో అరాచ‌కాలు కొన‌సాగిస్తుంటుంది. ప్ర‌జ‌ల్ని భ‌య‌భ్రాంతుల‌కి గురిచేయ‌డంతో పాటు, అడ్డొచ్చిన పోలీసుల్ని సైతం అంతం చేస్తుంటుంది. అలాంటి ప్రాంతానికి భీమా (గోపిచంద్‌) ఎస్సైగా వ‌స్తాడు. వ‌చ్చీ రావడంతోనే భ‌వానీ ముఠా ఆట క‌ట్టించేందుకు న‌డుం బిగిస్తాడు. అట‌వీ ప్రాంతం నుంచి ఈ ముఠా తీసుకెళుతున్న ట్యాంక‌ర్ల‌పై నిఘా వేస్తాడు. వాటి జోలికి ఎవ‌రొచ్చినా అస్స‌లు ఊరుకోని భ‌వానీ ఏం చేశాడు? అస‌లు ఆ ట్యాంక‌ర్ల‌లో దాగిన ర‌హ‌స్య‌మేమిటి? భ‌వానీని ముందు పెట్టి వెన‌క కథ న‌డిపిస్తున్న ఓ పెద్ద మ‌నిషి క‌థేమిటి?ప‌ర‌శురామ క్షేత్రం మూత‌ప‌డ‌టానికీ, ఈ ముఠాకీ సంబంధం ఏమైనా ఉందా? ఆ క్షేత్రం త‌లుపులు మ‌ళ్లీ తెర‌చుకున్నాయా లేదా? త‌దిత‌ర విష‌యాలు  తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని