Bollywood: జోడీ కుదిరిందా?

కథానాయికగా, సహాయనటిగా.. దాదాపు మూడు దశాబ్దాలుగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది సీనియర్‌ నాయికా టబు. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.

Updated : 29 Jan 2024 11:34 IST

కథానాయికగా, సహాయనటిగా.. దాదాపు మూడు దశాబ్దాలుగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది సీనియర్‌ నాయికా టబు. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ప్రముఖ కథానాయకుడు అజిత్‌ ‘ఏకే 63’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాన్ని ఈమధ్యే ప్రకటించారు. అందులో కథానాయికగా టబు నటిస్తున్నట్లు సమాచారం. ‘ఈ చిత్రంలో అజిత్‌కి జోడీగా టబును ఎంపిక చేసింది చిత్రబృందం. ప్రతినాయకుడి పాత్రలో అరవింద్‌స్వామి.. మరో కీలక పాత్రలో ఎస్‌.జె.సూర్య కనిపించనున్నారు. పూర్తి వివరాల్ని త్వరలో అధికారికంగా చిత్రబృందం ప్రకటించనుంద’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 24 ఏళ్ల కిందట అజిత్‌, టబు జంటగా ‘ప్రియురాలు పిలిచింది’ విడుదలైంది. ఇందులోని సంగీతం ఇప్పటికీ సినీప్రియుల మదిలో నిలిచి పోయింది.

బాలీవుడ్‌లో ఇప్పటికే తనకంటూ ఓ ఇమేజ్‌ ఏర్పరచుకున్న యువ కథానాయిక జాన్వీ కపూర్‌ దక్షిణాదిపైనా ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఎన్టీఆర్‌తో కలిసి ‘దేవర’తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతోన్న జాన్వీ.. తమిళంలోనూ కాలు మోపడానికి సిద్ధమవుతోంది. రాకేష్‌ ఓంప్రకాష్‌ మెహ్రా దర్శకత్వంలో తమిళ అగ్ర కథానాయకుడు సూర్య ‘కర్ణ’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇందులో సూర్య సరసన నటించడానికి జాన్వీని ఎంపిక చేసినట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఆధారంగా, రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని