Boney Kapoor: 19 ఏళ్ల తర్వాత సీక్వెల్‌.. బోనీకపూర్‌తో మాట్లాడని అనిల్‌ కపూర్‌

సూపర్‌ హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ ప్రకటించారు నిర్మాత బోనీకపూర్‌ (Boney Kapoor).

Published : 30 Mar 2024 17:26 IST

ముంబయి: దాదాపు 19 ఏళ్ల క్రితం తాను నిర్మించిన ఓ సూపర్‌హిట్‌ కామెడీ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత బోనీ కపూర్‌ (Boney Kapoor). విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. త్వరలోనే తమ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు తెలిపారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..?

‘‘సల్మాన్‌ఖాన్‌, అనిల్‌ కపూర్‌, ఫర్దీన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో అనీస్ బాజ్మీ తెరకెక్కించిన చిత్రం ‘నో ఎంట్రీ’. 2005లో విడుదలైన ఇది సూపర్‌ హిట్‌ అయ్యింది. దీనికి కొనసాగింపుగా ‘నో ఎంట్రీ 2’ ప్లాన్‌ చేస్తున్నాం. డిసెంబర్‌ నుంచి షూట్‌ మొదలుపెట్టనున్నాం. అర్జున్‌ కపూర్‌, దిల్జిత్‌, వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో 10 మంది హీరోయిన్స్‌ ఉంటారు. వాళ్ల ఎంపిక ఇంకా జరగలేదు. సినిమా కాన్సెప్ట్ ఏమిటనేది ఇప్పుడే చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే, గతంలో ఇలాగే కాన్సెప్ట్ ముందే చెప్పడంతో కొంతమంది దాన్ని కాపీ కొట్టారు. ‘నో ఎంట్రీ’ సీక్వెల్‌ గురించి తెలిసి అనిల్‌కపూర్‌ నన్ను సంప్రదించాడు. సినిమాలో ఖాళీ లేదని చెప్పడంతో తనకు కోపం వచ్చింది. నచ్చజెప్పేందుకు ప్రయత్నించా. కాకపోతే అతను ఇంకా మాట్లాడటం లేదు.’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని