Bramayugam: ‘భ్రమయుగం’ ఆఫర్.. రూ.150కే టికెట్.. మరి మల్టీప్లెక్స్లో ఎంతంటే?
మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘భ్రమయుగం’ మార్చి 23న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.
ఇంటర్నెట్డెస్క్: ప్రేక్షకులను థియేటర్కు రప్పించేందుకు ఉన్న అన్ని అవకాశాలను నిర్మాతలు పరిశీలిస్తున్నారు. ఇటీవల ‘హను-మాన్’ టికెట్ ధరలను తగ్గించి, మరింత మంది థియేటర్కు వచ్చేలా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘భ్రమయుగం’ (Bramayugam) కూడా అదే బాటలో పయనిస్తోంది. మమ్ముట్టి (Mammootty ) కీలక పాత్రలో రాహుల్ సదాశివన్ రూపొందించిన డార్క్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ఇది. ఇప్పటికే మలయాళంలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మార్చి 23వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని విడుదల చేస్తోంది. ఈ క్రమంలో టికెట్ ధరలను తగ్గించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150, ఎంపిక చేసిన మల్టీప్లెక్స్లలో రూ.200లకే టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది.
మలయాళంలో ‘భ్రమయుగం’ ఇప్పటివరకూ రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో దర్శకుడు రాహుల్ సదాశివన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘మమ్ముట్టి లెజెండరీ యాక్టర్. ఒకవేళ ఆయన ఈ మూవీలో కుడుమోన్ పొట్టి పాత్రను ఒప్పుకోకపోతే, అసలు సినిమానే తీసేవాడిని కాదు. ఆయన సెట్లో అడుగుపెట్టగానే కొద్దిసేపు అంతా నిశ్శబ్దమే. మమ్ముట్టి తేజస్సు అలాంటిది. కానీ, మరికాసేపటికే ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ సెట్ అంతా సందడిగా మారేలా చేసేవారు. కొన్నిసార్లు మేము తీస్తున్నది హారర్ మూవీయా? లేక కామెడీ సినిమా అన్నట్లు ఉండేది. పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో సినిమాలో పాత్రల మధ్య వచ్చే సంభాషణలు, వాడే పదాల్లో ఆధునికత కనిపించదు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఆ ఇబ్బంది కలగకుండా నటీనటులు వాటిని మరింత మెరుగుపరిచారు. ఇక ఈ విషయంలో మమ్ముట్టి గురించి చెప్పాల్సింది ఏముంది. పాత్రకు తగినట్లు ఆయన మారిపోయేవారు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునేవారు’’ అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో నటించిన అర్జున్ అశోకన్ మాట్లాడుతూ.. ‘భ్రమయుగం’ చేయడం ఒక కలలా ఉందని అన్నారు. నేను చదువుకుంటున్న రోజుల్లో మమ్ముట్టి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడిగా ఉండేవాడినని, అలాంటిది ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఇంతకీ భ్రమయుగం కథేంటో తెలుసా: తేవన్ (అర్జున్ అశోకన్) జానపద గాయకుడు. తన తల్లిని కలుసుకునేందుకు వెళ్తూ అడవిలో దారి తప్పిపోతాడు. ఆకలితో తిరుగుతూ చివరకు ఓ పాడుబడిన ఇంటికి చేరుకుంటాడు. ఆ ఇంట్లో మనక్కల్ కుడుమోన్ పొట్టి (మమ్ముట్టి), అతని కుమారుడు (సిద్ధార్థ్ భరతన్) మాత్రమే ఉంటారు. చాలా రోజుల తర్వాత ఓ అతిథి తన ఇంటికి రావడంతో కుడుమోన్ ఆనందంతో అతడికి అన్ని వసతులు కల్పిస్తాడు. అడవిలో అందునా పాడుపడిన ఇంట్లో ఉన్న పరిస్థితులు చూసి తేవన్కు అనుమానం కలుగుతుంది. తాను కుడుమోన్ ఉచ్చులో చిక్కుకుపోయానని అతడికి అర్థమవుతుంది. ఆ ఇంటి నుంచి తప్పించుకుపారిపోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కుడుమోన్ తాంత్రిక విద్య వల్ల తేవన్ మళ్లీ, మళ్లీ అక్కడికే వస్తాడు. మరి తేవన్ ఆ ఇంటి నుంచి ఎలా బయటపడ్డాడు? ఇంతకీ కుడుమోన్ ఎవరు? అన్నది మిగిలిన కథ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్