Nani: తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్తో నాని.. ఏం మాట్లాడారంటే!
బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్గా వ్యవహరిస్తోన్న గారెత్ విన్ ఓవెన్ హీరో నానిని కలిశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రా, తెలంగాణకు బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్గా వ్యవహరిస్తోన్న గారెత్ విన్ ఓవెన్ హీరో నానిని (Nani) కలిశారు. హైదరాబాద్లోని నాని నివాసానికి వెళ్లిన గారెత్ కొంత సమయం గడిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ‘నానితో సమయం గడపడం ఎంతో ఆనందంగా ఉంది. తన సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్నా. తెలుగు చిత్ర పరిశ్రమతో బ్రిటన్ సంబంధాలు ఎలా బలోపేతం చేసుకోవచ్చో ఇద్దరం చర్చించుకున్నాం. ఆయన నటించిన ఏవైనా రెండు సినిమాలు చూడమని నాని కోరారు. ఏ చిత్రాలు చూడాలో నాకు చెప్పండి’ అంటూ నెటిజన్లను సలహా అడిగారు.
సినిమాల విషయానికొస్తే.. వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్నారు హీరో నాని. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)లో నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబినేషన్లో విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. ఇందులో నాని మాస్లుక్లో కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఎస్.జె.సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ‘బలగం’ సినిమాతో దర్శకుడుగా మంచి గుర్తింపు అందుకున్న వేణు దర్శకత్వంలోను నాని నటించనున్నట్లు టాక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.