Chandu Champion: ఎవరికీ లొంగని ఛాంపియన్
బాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్ల హవా నడుస్తోంది. ఇప్పుడీ బాటలోనే మరికొద్ది రోజుల్లో ‘చందు ఛాంపియన్’తో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలీవుడ్ కథానాయకుడు కార్తిక్ ఆర్యన్.
బాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్ల హవా నడుస్తోంది. ఇప్పుడీ బాటలోనే మరికొద్ది రోజుల్లో ‘చందు ఛాంపియన్’తో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలీవుడ్ కథానాయకుడు కార్తిక్ ఆర్యన్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేస్తున్న ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని తన ఫస్ట్ లుక్ను ఇన్స్టా వేదికగా విడుదల చేశాడు కార్తిక్. ‘‘ఛాంపియన్ వచ్చేస్తున్నాడు. నా కెరీర్లోనే ఎంతో సవాలుతో కూడిన చిత్రంలోని మొదటి పోస్టర్ను మీతో పంచుకుంటున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంద’’ని వ్యాఖ్యలు జోడించాడు. ఇందులో కండలు తిరిగిన దేహంతో.. ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్న ఛాంపియన్లా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు కార్తిక్. ‘‘ఎవరికీ లొంగని వ్యక్తి’’ అనే వ్యాఖ్యతో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది.
విల్ యాక్షన్తో థ్రిల్
‘విత్ఔట్ రెమోర్స్’, ‘సికరియో: డే ఆఫ్ ది సోల్డాడో’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు ఇటాలీయన్ దర్శకనిర్మాత స్టెఫానో సొల్లిమా. ఇప్పుడీయన మరో యాక్షన్ థ్రిల్లర్ ‘షుగర్ బండిట్స్’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ‘కింగ్ రిచర్డ్’, ‘అలీ’ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విల్ స్మిత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించనున్నారు. ‘ఈ సినిమా చక్ హోగన్ రాసిన ‘డెవిల్స్ ఇన్ ఎక్సైల్’ రూపొందుతోంది. ఇందులో బోస్టన్లోని మాదకద్రవ్యాల వ్యాపారాన్ని మట్టి కరిపించే ప్రత్యేక దళాల మాజీ సైనికుడి పాత్రలో విల్ కనిపించనున్నారు’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ర్యాన్ షిమాజాకి పర్యవేక్షణలో వెస్ట్ స్టూడియోస్ పతాకంపై జాన్ మోనేతో కలిసి విల్ స్మిత్ నిర్మించనున్నారు.
ఢీకొట్టే.. డేంజర్ లంక
డీసీపీ బాజీరావ్ సింగమ్ పాత్రలో అజయ్ దేవగణ్ని ఢీకొట్టే ప్రతినాయకుడిగా అర్జున్ కపూర్ సిద్ధంగా ఉన్నారు. మరి వారు తలపడేది దేని కోసమో తెలియాలంటే ‘సింగమ్ అగైన్’ చూడాల్సిందే. ఇందులో అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, కరీనా కపూర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తిచేసుకున్నారు అర్జున్. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటోని పంచుకున్నారు. ‘రోహిత్ శెట్టి కాప్ ప్రపంచంలోని విలన్ని నేను. ‘సింగమ్ అగైన్’లో నా వంతు పని ముగిసింది. మాస్ సినిమాలకి బాస్ అయిన దర్శకుడితో నా 20వ సినిమా చేయడం గర్వంగా ఉంది. ఈ చిత్రం నా కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుందని ఆశిస్తున్నాను. భారతీయ సినిమాల్లో అత్యంత వినోదాత్మక ఫ్రాంచైజీలలో ఒకటైన ఈ ప్రాజెక్టులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. త్వరలో వెండితెరపై గర్జించే ‘సింగమ్ అగైన్’ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు అర్జున్. విలన్గా కనిపించే అర్జున్ కపూర్ పాత్ర పేరు ‘డేంజర్ లంక’ అని ప్రచారం సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు