Chiranjeevi: కార్మికుల కోసం అడగ్గానే అంగీకరించారు: చిరంజీవి

ప్రముఖ హీరో చిరంజీవి హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని, సందడి చేశారు. ఆ సంగతులివీ..

Published : 21 Apr 2024 18:57 IST

హైదరాబాద్‌: వైద్య పరీక్షల ఖర్చు సినీ కార్మికులకు అందుబాటులో ఉండేలా చేయగలవా? అని విజ్ఞప్తి చేయగానే యోదా డయాగ్నస్టిక్స్‌ ఫౌండర్‌, ఛైర్మన్‌ సుధాకర్‌ కంచర్ల కాదనలేదని పేర్కొన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi). యోదా కొత్త బ్రాంచ్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. ‘‘చాలామంది సినీ కళాకారులు, కార్మికులు ఏ రోజు సంపాదనతో ఆ రోజు గడుపుతుంటారు. అలాంటి వారికి ఇక్కడ వైద్య పరీక్షలను అందుబాటు ధరల్లో చేయగలవా? అని గతంలో అమీర్‌పేటలో ఈ సెంటర్‌ని ప్రారంభించిన సమయంలో సుధాకర్‌ను సడెన్‌గా అడిగా. కచ్చితంగా చేస్తానన్నయా అని చెప్పాడు. ఆ మేరకు 14 వేల మంది కార్మికులకు చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌, యోదా డయాగ్నస్టిక్స్‌ సెంటర్‌ సంయుక్తంగా హెల్త్‌ కార్డులు ఇచ్చాయి. కార్డులు జారీ చేసిన వారితోపాటు కుటుంబానికీ వెసులుబాటు కల్పించారు. సామాజిక స్పృహ కలిగిన అతడిపై నాకు గౌరవం ఉంది’’ అని అన్నారు. ప్రసంగం అనంతరం పలువురు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు హెల్త్‌ కార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు పాల్గొన్నారు.

చిరంజీవి సినిమాల విషయానికొస్తే..  ప్రస్తుతం ‘విశ్వంభర’ (Vishwambhara)లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్రిష హీరోయిన్‌. సురభి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని