Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ చిత్రబృందాన్ని అభినందించిన చిరంజీవి
సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ‘టిల్లు స్క్వేర్’ చిత్రాన్ని చిరంజీవి అభినందించారు.
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ‘టిల్లు స్క్వేర్’తో(Tillu Square) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హిట్ చిత్రం ‘డీజే టిల్లు’కు ఇది సీక్వెల్. మల్లిక్రామ్ తెరకెక్కించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. మార్చి 29న విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. అగ్ర కథానాయకుడు చిరంజీవి, నానీ చిత్రబృందాన్ని అభినందించారు.
‘‘సిద్ధు అంటే మా కుటుంబసభ్యులకు ప్రత్యేకమైన అభిమానం. ‘డీజే టిల్లు’ నాకెంతో నచ్చిన చిత్రం. దానికి సీక్వెల్గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ను ఎంజాయ్ చేస్తూ చూశాను. యూత్ సినిమా అంటున్నారు. కానీ.. యూనివర్సల్ మూవీ ఇది. ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించింది. అందరూ తప్పక చూడాల్సిన సినిమా. ఈ చిత్రం కోసం టీమ్ ఎంతో కష్టపడింది. దర్శకుడు మల్లిక్ చాలా బాగా రూపొందించారు. సిద్ధు కథ రాయడంతోపాటు అద్భుతంగా నటించాడు. సినిమా మంచి విజయం సాధించింది. చిత్రబృందానికి అభినందనలు’’ అని చిరంజీవి అన్నారు. ‘‘టిల్లు స్క్వేర్ వినోదాత్మక చిత్రం. టిల్లుగా సిద్ధు సినిమాను చివరి వరకూ నడిపించాడు. చాలా మంచి సినిమా. చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అని హీరో నానీ ఎక్స్లో పోస్టు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.