GANAPATH: గణపథ్‌.. ఎవరినీ వదిలిపెట్టడు

‘మన కోసం ఓ వీరుడు వచ్చే వరకు యుద్ధం మొదలు పెట్టొద్దు’ అంటున్నారు అమితాబ్‌ బచ్చన్‌. మరి ఆ వీరుడు ఎవరు? ప్రజల కోసం ఎలాంటి సాహసాలు చేయబోతున్నాడనేది తెలియాలంటే ‘గణపథ్‌: ఎ హీరో ఈజ్‌ బోర్న్‌’ సినిమా చూడాల్సిందే.

Updated : 30 Sep 2023 14:02 IST

‘మన కోసం ఓ వీరుడు వచ్చే వరకు యుద్ధం మొదలు పెట్టొద్దు’ అంటున్నారు అమితాబ్‌ బచ్చన్‌. మరి ఆ వీరుడు ఎవరు? ప్రజల కోసం ఎలాంటి సాహసాలు చేయబోతున్నాడనేది తెలియాలంటే ‘గణపథ్‌: ఎ హీరో ఈజ్‌ బోర్న్‌’ సినిమా చూడాల్సిందే. బాలీవుడ్‌ కథానాయకుడు టైగర్‌ ష్రాఫ్‌, కృతిసనన్‌ జంటగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వికాస్‌ బహ్ల్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తెలుగు టీజర్‌ను అగ్రకథానాయకుడు చిరంజీవి సామాజిక మాధ్యమాల వేదికగా శుక్రవారం విడుదల చేశారు. 2070 ఎ.డి నేపథ్యంలో మొదలైన ఈ టీజర్‌ నమ్మకం, జాలి, దయ లేని ఓ ప్రపంచంలో.. గణపథ్‌ వాటి కోసం చేసే కళ్లు చెదిరే యాక్షన్‌ సన్నివేశాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘మా వాళ్ల జోలికి వస్తే అస్సలు వదిలిపెట్టను’ అంటూ టైగర్‌ చివర్లో చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌లో తన  రియాక్షన్‌ సీన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కృతి. ఇందులో అమితాబ్‌ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. అక్టోబరు 20న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని