Chiranjeevi: ఆమె మాట నాకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది.. : చిరంజీవి
మహానటి సావిత్రి సినీ ప్రస్థానంపై సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ (Savitri Classics) పుస్తకాన్ని ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) ఆవిష్కరించారు.
ఇంటర్నెట్డెస్క్: మహానటి సావిత్రి సినీ ప్రస్థానంపై సంజయ్ కిషోర్ రచించిన పుస్తకం ‘సావిత్రి క్లాసిక్స్’ (Savitri Classics). అగ్ర కథానాయకుడు చిరంజీవి మంగళవారం సాయంత్రం దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
‘‘సావిత్రమ్మ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. ఆమెతో మంచి అనుబంధం ఉన్నందుకు గర్వపడుతున్నాను. ‘పునాదిరాళ్లు’లో నాకు అవకాశం కాకతాళీయంగా వచ్చింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోర్సు పూర్తి కాకుండానే నటించా. ఆ సినిమా కోసం రాజమండ్రి వెళ్తున్నప్పుడు.. నువ్వు సావిత్రమ్మ సినిమాలో నటిస్తున్నావని చెప్పడంతో సంతోషపడ్డాను. చిత్రీకరణకు ముందు ఆమెను చూశాను. ఓసారి నేను డ్యాన్స్ చేస్తూ కిందపడ్డా. అయినా సరే ఆపలేదు. అది చూసిన ఆమె.. ‘భవిష్యత్తులో మంచి నటుడివి అవుతావు’ అని మెచ్చుకున్నారు. ఆ మాట నాకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. కొన్నేళ్ల తర్వాత ‘ప్రేమ తరంగాలు’ కోసం పనిచేశాం. ఆమె నాకు తల్లిగా నటించారు. ఆ తర్వాత ఆమెతో నటించే అవకాశం రాలేదు. కళ్లతోనే హావభావాలు పలికించే గొప్ప నటి. ప్రపంచంలో ఆమెలా మరెవ్వరూ చేయలేరు. మా నాన్న అభిమాన నటి. అనుక్షణం ఆమెను ఆరాధిస్తుంటా’’ అని చిరంజీవి అన్నారు.
అనంతరం సావిత్రి కుమార్తె చాముండేశ్వరి మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి నాకు అన్నలాంటి వ్యక్తి. అమ్మకు ఒక పెద్ద కొడుకు ఉంటే ఏం చేస్తారో ఈరోజు ఆయన అదే చేశారు. పుస్తకావిష్కరణ నిమిత్తం కొన్ని రోజుల క్రితం ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశా. ఆయన ఇంట్లోనే పుస్తకం విడుదల చేద్దామని చెప్పా. కానీ, ఆయన మాత్రం ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేశారు. ఇంతమంది సమక్షంలో దీనిని విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఇదే కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖ పాల్గొన్నారు. సురేఖ అడిగిన పలు ప్రశ్నలకు చాముండేశ్వరి సమాధానమిచ్చారు.
అమ్మ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే పలు చిత్రాలు, పుస్తకాలు వచ్చాయి. ‘సావిత్రి క్లాసిక్స్’ తీసుకురావాలని ఎందుకు అనిపించింది?
చాముండేశ్వరి: ‘మహానటి’ గొప్ప విజయాన్ని అందుకుంది. నేటితరం యువత కూడా అమ్మ గురించి గొప్పగా చెబుతున్నారంటే ఆ సినిమా వల్లే సాధ్యమైంది. అమ్మ బాల్యం, సినిమా కెరీర్, సేవలు, మరణం ఇలా అన్నీ చూపించారు. ఆమె ఫిల్మోగ్రఫీపై ఒక పుస్తకం ఉండాలని భావించా. అలా వచ్చిందే ఈ పుస్తకం. ఇందులో కేవలం ఆమె యాక్టింగ్కు సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి.
ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర నటీనటులు, దర్శకులు ఉండగా.. ఈయనతోనే (చిరంజీవి) విడుదల చేయించాలని ఎందుకు అనుకున్నావు?
చాముండేశ్వరీ: కొంతమంది చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం ఉండదు. చిరంజీవి అలా కాదు. ఆయన మాటలు, చేతల్లో నిజాయతీ ఉంటుంది. అమ్మకు ఆయన ఎంతటి వీరాభిమానో నాకు తెలుసు. అందుకే ఆయనతో రిలీజ్ చేయించాలనుకున్నా.
చిన్నతనంలో అమ్మతో టైమ్ స్పెండ్ చేయడానికి వీలు ఉండేదా?
చాముండేశ్వరీ: స్కూల్ రోజుల్లో పేరెంట్స్ మీట్కు రావడానికి ఆమెకు ఖాళీ ఉండేది కాదు. అన్నం తినిపించడం, స్కూల్కు రెడీ చేయడం ఇలా.. చిన్నప్పుడు మా పనులన్నీ అమ్మమ్మ చేసేవారు. షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా అమ్మ మాకంటూ టైమ్ ఇవ్వడానికి చూసేవారు. షూట్ నుంచి ఇంటికి రాగానే నన్ను తీసుకువెళ్లి.. తన పక్కనే పడుకోబెట్టుకునేవారు. అమ్మ కూడా మమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నారని అర్థమయ్యేది. మా కోసం కష్టపడింది. ఆస్తులు సంపాదించింది. ఎంతోమందికి సాయం చేసింది. అమ్మకు చింతచిగురు అంటే ఇష్టం. ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కడైనా చింత చెట్టు కనిపిస్తే కారు ఆపి కాయలు కోసేవాళ్లం. పౌర్ణమి రోజున రాత్రి పూట బీచ్కు వెళ్లి సరదాగా గడిపేవాళ్లం. తిరుపతికి ఆమె కాలి నడకన వెళ్లేవారు. జంతువులంటే ఆమెకు చాలా ఇష్టం.
అమ్మ మీకోసం వంట చేసి పెట్టేవారా?
చాముండేశ్వరి: అమ్మమ్మ బాగా వంట చేస్తారు. అమ్మ షూటింగ్లో బిజీగా ఉంటే అమ్మమ్మ క్యారేజీలు కట్టి పంపించేవారు. నటీనటులందరూ కలిసి భోజనం చేసేవారు. వీలు కుదిరినప్పుడల్లా అమ్మ ఇంట్లో వంట చేసేవారు. కోడిగుడ్డు ఆమ్లెట్ కర్రీ, చికెన్ ఫ్రై చేసేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది. -
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
తాను సినిమాలు చేయడం మాననని నటుడు విశాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు.. యూటర్న్ తీసుకున్నా: సూర్య
‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య (Suriya) పాల్గొన్నారు. తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. -
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. అంధులకు బెల్లకొండ శ్రీనివాస్ సాయం
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంధులకు సాయం చేశారు బెల్లకొండ సాయి శ్రీనివాస్ -
ఆయన్ని చూడగానే కన్నీళ్లు ఆగలేదు: తమన్
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) తాజాగా ఓ సంగీత కార్యక్రమంలో మాట్లాడారు. -
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. -
యూట్యూబ్లో రామ్ మూవీ సంచలనం.. హిందీలో హవా..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’(Skanda). దీని హిందీ వెర్షన్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. -
‘పుష్ప 2’ ఆలస్యంపై అల్లు శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పుష్ప 2’ (Pushpa2) పై అల్లు అర్జున్ (Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) స్పందించారు. సుకుమార్ అద్భుతంగా దీనిని తీర్చిదిద్దుతున్నారన్నారు. -
బిగ్ కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి కారణమదే: జాన్వీకపూర్
నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్నారు. బిగ్ కమర్షియల్ చిత్రాల్లో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి