Waltair veerayya: ప్రేక్షకులకు కిక్ ఇవ్వడం కోసమే అలా చేశాం..: చిరంజీవి
చిరంజీవి(Chiranjeevi) నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair veerayya). సంక్రాంతి కానుకగా జనవరి 13న సందడి చేయడానికి సిద్ధమయ్యాడు ‘వాల్తేరు వీరయ్య’. ఈ సందర్భంగా మీడియాతో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. నాటునాటు పాటకు ‘గోల్డెన్ గ్లోబ్’ (Golden Globe) అవార్డు వచ్చినందుకు ‘RRR’ టీమ్కు, కీరవాణికి అభినందనలు తెలిపిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ విశేషాలు పంచుకున్నారు.
తెలుగు సినిమాకు ఇది స్వర్ణయుగం అంటారా?
చిరంజీవి: అసలు మన తెలుగు సినిమా ఎప్పటి నుంచో స్వర్ణయుగంలో ఉంది. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. దానిని నేటి దర్శకులు, హీరోలు కొనసాగిస్తున్నారు.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
చిరంజీవి: నా అభిమానులు ఏం కోరుకుంటారో దానిని ఇవ్వడానికి నేను తపన పడుతుంటాను. వైవిధ్యభరితమైన సినిమాలు, పాత్రలు చేయడాన్ని ఇష్టపడతాను. ఈ సినిమాలో పాత చిరంజీవిని మళ్లీ చూస్తారు. ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మెగుడు’, ‘ముఠా మేస్త్రీ’ల్లో చిరంజీవి ఎలా ఉన్నాడో ‘వాల్తేరు వీరయ్య’లో కూడా అలా ఉంటాడు. ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. షూటింగ్ను బాగా ఎంజాయ్ చేశాను. నా కాస్టూమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు ఇంత మాస్గా కనిపించలేదు.
ఏదైనా సన్నివేశాన్ని మళ్లీ చేద్దామని దర్శకులు చెబుతారా? మీరు చేసిందే ఫైనల్ చేస్తారా?
చిరంజీవి: నేను దర్శకుడికి, ఫైట్ మాస్టర్కు, కొరియోగ్రాఫర్కు పూర్తి స్వేచ్ఛనిస్తాను. వాళ్లు సీన్ ఓకే అనే వరకూ స్పాట్ నుంచి కదలను. మొదటి సినిమా అప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పటికీ అలానే ఉన్నాను. దీనికి కారణం ప్రేక్షకుల ఆదరణ. అలాగే దర్శక నిర్మాతలు. ఒక సినిమా బాగా రావాలంటే చాలా మంది కష్టపడాలి. అమితాబ్ బచ్చన్గారు మా అందరికీ స్ఫూర్తి. ఆయన నేటికీ యంగ్ హీరోలతో పోటీపడి నటిస్తుంటారు.
మీరు, రవితేజ కలిసి ‘అన్నయ్య’ సినిమాలో చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు కలిసి నటించారు.. ఎలా అనిపించింది?
చిరంజీవి: రవితేజ ఆరోజుల్లో ఎలా ఉన్నాడో ఈరోజూ అలానే ఉన్నాడు. తన ఎనర్జీతో ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యాడు. కథకు బలాన్ని చేకూర్చాడు. ఈ పాత్రకు రవితేజ అయితే బాగుంటుందని అందరం అనుకున్నాం. ఈ సినిమాలో ఇద్దరం డైలాగ్లు మార్చుకున్నాం. తన ఇడియట్లో డైలాగ్ నేను.. నా సినిమాలో డైలాగ్ తను చెప్పాడు. ఫ్యాన్స్కు కిక్ ఇవ్వడం కోసమే అలా డైలాగ్స్ మార్చుకున్నాం.
సంక్రాంతికి మీ సినిమా ఎప్పుడూ ముందే వస్తుంది. ఈసారి కాస్త వెనకబడ్డారా?
చిరంజీవి: ఈ సంక్రాంతికి మైత్రీ సంస్థ నుంచే రెండు సినిమాలు రావడం చాలా సంతోషంగా ఉంది. మంచి సినిమా ఎప్పుడైనా విజయం సాధిస్తుంది. బయ్యర్లను, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాకు టెక్నాలజీ కంటే కంటెంట్ ముఖ్యం. నేను దాన్నే నమ్ముతాను. బాబీ కూడా ఈ విషయంలో నాలానే ఆలోచిస్తారు.
కమర్షియల్ సినిమాని ఇష్టపడతారా? బాబీ మీకు వాల్తేరు వీరయ్య కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
చిరంజీవి: కచ్చితంగా కమర్షియల్ సినిమాలపైనే దృష్టి పెడతాను. నాకేం కావాలి అనేదానికంటే ప్రేక్షకులకు ఏం కావాలి అనేదే ఎక్కువ ఆలోచిస్తా. అలాగే కంటెంట్ ఉంటే సీక్వెల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కథలో ఎన్ని పాటలున్నాయి, ఎన్ని ఫైట్స్ ఉన్నాయని చూడను. అవ్వన్నీ అలంకారాలని భావిస్తాను. కథకు సహజ సౌందర్యం అంటే అది భావోద్వేగం. అందుకే కథలో ఎంత ఎమోషన్ ఉందో చూస్తా. అందరూ కథలు వింటారు కానీ నేను కథను చూస్తాను. కథ చెప్పేటప్పుడే విజువలైజేషన్ చేసుకుంటా. ప్రేక్షకులు రూ.100 ఇచ్చి సినిమాకు వస్తే మనం వాళ్లకు ఏం అందిస్తున్నాం అనేది చూస్తా.
శ్రుతి హాసన్, దేవీశ్రీ ప్రసాద్ గురించి.. ?
చిరంజీవి: శ్రుతి హాసన్ నా పక్కన డ్యాన్స్ అలవోకగా చేసింది. చలిలో కూడా ఎంజాయ్ చేస్తూ చేశాం. తనతో మళ్లీ మళ్లీ నటించాలనుకుంటున్నాను. ఇక రవితేజ ఎంత ఎనర్జీతో ఉంటాడో దేవీశ్రీ ప్రసాద్ అంతకు డబుల్ ఎనర్జీతో ఉంటాడు. లిరిక్స్ కూడా తనే రాసేస్తాడు. ఈ సినిమాలోని అన్ని పాటలు నాకు నచ్చాయి.
మీకు అతి మంచితనం అవసరమా అని మీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మీరేమంటారు?
చిరంజీవి: కచ్చితంగా అవసరమే. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎదరుతిరిగితే నా అహం చల్లారుతుందేమో కానీ, సినిమాకు భారీగా నష్టం వస్తుంది. అభిమానులు నిరాశ చెందుతారు. నా సంయమనం ఇంత మందికి మంచి చేస్తుందంటే నేను వెనక్కి తగ్గుతాను. అంతిమ ఫలితం చూస్తాను.
మీరు సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే అణకువగా ఉన్నారు? కొత్త హీరోలు కూడా ఇలానే ఉంటున్నారనుకుంటున్నారా?
చిరంజీవి: కొందరికి ఇలా ఉండడం సహజంగానే వస్తుంది. మన కోసం కాకుండా ఇతరుల కోసం ఆలోచించాలి. ఆ ఇతరులలో దర్శకులు, నిర్మాతలు, టెక్నికల్ టీం అంతా ఉంటారు. మన ప్రవర్తన అన్నిటికంటే ముఖ్యం. అది బాగుంది కాబట్టే నాకు వరసగా సినిమాలు వచ్చాయి. నాకు పనిలేకుండా ఉండడం కానీ, పనిచేయకుండా ఉండడం కానీ ఇష్టం ఉండదు. నేను పెద్దగా చదువుకోలేదు. పుస్తకాలు కూడా చదవను. కానీ ప్రతి సంఘటన నుంచి నేర్చుకుంటాను. అలాగే యంగ్స్టర్స్ని చూసి కూడా కొన్ని విషయాల్లో స్ఫూర్తిపొందుతాను.
దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందా?టికెట్ ధరల విషయంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఎలా అనిపించింది?
చిరంజీవి: జీవితాంతం సినిమాతో మమేకం అవ్వాలనే ఉంది. అలాంటి సందర్భం వచ్చి, దర్శకత్వం చేయగలననే నమ్మకం వస్తే చేస్తాను. ప్రభుత్వ నిర్ణయాలను మనం గౌరవించాలి. టికెట్ ధరల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
బాబీ సింహా గురించి చెప్పండి?
చిరంజీవి: బాబీ సింహా జాతీయ అవార్డు పొందిన నటుడు. నా సినిమాల్లో డైలాగులు, పాటలు అవలీలగా చెప్పాడు. తనది తమిళనాడు అనుకున్నాను. తెలుగువాడని తెలిసి ఆశ్చర్యపోయాను. తను కూడా నా అభిమాని. ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు.
రీమేక్ సినిమాలు చేయడం రిస్క్తో కూడుకున్నదా?
చిరంజీవి: ఒక రీమేక్ కథ చేస్తున్నప్పుడు మన హీరో ఇందులో ఎలా ఉంటాడనే ఆత్రుత అందరికీ ఉంటుంది. ‘గాడ్ ఫాదర్’ విజయానికి కారణం కూడా ఇదే. ఆ సినిమా ఒరిజినల్కు కొన్ని మార్పులు చేసి తీశాం. ‘గాడ్ ఫాదర్’ ఒరిజినల్ చూసినప్పటికీ రీమేక్నూ ఆదరించారు. ఇప్పుడు మరో రీమేక్లో నటిస్తున్నా.
బాబీ గురించి చెప్పండి?
చిరంజీవి: తను నాకు పెద్ద అభిమాని. నా అభిమానిగా అతడిని ఇష్టపడ్డాను. దర్శకుడిగా దాసోహమయ్యాను. డైరెక్టర్గా ఎక్కువ మార్కులు సంపాదించాడు. చాలా కష్టపడ్డాడు. ఏదైనా సీన్ మార్చాలంటే తన టీంతో రాత్రంతా కూర్చొన్ని ఆలోచిస్తాడు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి.. వాళ్ల నాన్న చిన్నదినం జరిగిన వెంటనే షూటింగ్కు వచ్చాడు. అంత కమిట్మెంట్తో పనిచేస్తాడు. అందుకే బాబీకి నేను అభిమానిని అయ్యాను. ఈ సినిమా హిందీలో కూడా ‘పుష్ప’లాగా ప్రేక్షకాదరణ పొందుతుందని అనుకుంటున్నాను.
గొప్ప నటుడుగా ఉండాలనుకుంటున్నారా?మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నారా?
చిరంజీవి: మంచి నటుడు అనేది నాకు దక్కిన గొప్ప వరంగా భావిస్తా. అది నా అదృష్టం. కానీ అది శాశ్వతం కాదన్నది సత్యం. ఒక మంచి మనిషి అనేది శాశ్వతం. అది కాదనలేని సత్యం. మనం చనిపోయినా అది మాత్రం నిలిచిపోతుంది. రియల్ హీరోగా ఉంటూ రీల్ హీరోగా ఎక్కువకాలం కొనసాగాలని నా కోరిక.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఐడెంటిటీ మార్చుకోవాల్సి వస్తే: విజయ్ ఆంటోనీ సమాధానమేంటంటే?
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తుఫాన్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. -
నిహారిక ధైర్యాన్ని మెచ్చుకోవాలి : సిద్ధూ జొన్నలగడ్డ
‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. -
‘దేవర’ సాంగ్ అప్డేట్ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. ఏమన్నారంటే?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమా సాంగ్ అప్డేట్ ఇచ్చారు శేఖర్ మాస్టర్. -
నిజమైన సింహంతో ఫస్ట్ ఆసియా ఫిల్మ్.. ‘మాంబో’!
‘అరణ్య’తో అలరించిన దర్శకుడు ప్రభు సాల్మన్ మరో సరికొత్త ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. -
తనే నిజం చెబితే బాగుంటుంది: రాజ్ తరుణ్ ఇష్యూపై డైరెక్టర్ రవికుమార్
రాజ్ తరుణ్ ఇష్యూపై దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ స్పందించారు. రాజ్ తరుణ్ హీరోగా రవికుమార్ తెరకెక్కించిన చిత్రం ‘తిరగబడర సామీ’ త్వరలోనే విడుదల కానుంది. -
అందుకే రాజ్ తరుణ్ను హీరోగా తీసుకున్నా: ‘పురుషోత్తముడు’ డైరెక్టర్
రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన తెరకెక్కించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ప్రచారంలో భాగంగా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
రాజ్తరుణ్ వల్ల ‘పురుషోత్తముడు’ బిజినెస్ లాస్ అయిందా?.. నిర్మాత ఏమన్నారంటే!
‘పురుషోత్తముడు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. రాజ్తరుణ్ వల్ల సినిమా బిజినెస్ లాస్ అయిందా?అనే ప్రశ్నకు నిర్మాత రమేశ్ సమాధానమిచ్చారు. -
‘రాజాసాబ్’పై తమన్ ఆసక్తికర కామెంట్స్.. ఏం అప్డేట్ ఇచ్చారంటే?
ప్రభాస్ ‘రాజాసాబ్’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. -
లీక్స్పై స్పందించిన ‘వీడీ 12’ టీమ్.. సోషల్ మీడియాలో పోస్ట్
లీక్స్ రావడంపై ‘వీడీ 12’ టీమ్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. -
అది చిన్న విషయం కాదు: ‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్పై పూరి జగన్నాథ్
తన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’లోని ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రత్యేకంగా మాట్లాడారు. -
హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా?: ప్రశ్నించిన అనిల్ రావిపూడి
హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా? అని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశ్నించారు. ఏం జరిగిందంటే? -
ఎన్టీఆర్పై ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రశంసలు: ‘దేవర’ సాంగ్ గురించి ఏమన్నారంటే?
టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్పై కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. -
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబో.. సర్ప్రైజ్ అదిరింది
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘సూర్య 44’ (వర్కింగ్ టైటిల్). సూర్య పుట్టినరోజు సందర్భంగా టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది. -
వీటి ఆధారంగా ‘కల్కి’ రెండు భాగాలు: ఫొటో పంచుకున్న నాగ్ అశ్విన్
‘కల్కి 2898 ఏడీ’ సినిమాకి సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఫొటో పోస్ట్ చేశారు. -
ఆర్ఆర్ఆర్ను బీట్ చేసిన కల్కి 2898 ఏడీ.. వసూళ్లు ఎంతంటే?
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లను అధిగమించింది. -
రెండు సినిమాల అప్డేట్స్ చెప్పిన రజనీకాంత్.. ‘ఇండియన్ 2’ గురించి ఏమన్నారంటే!
తన అప్కమింగ్ సినిమాల అప్డేట్లను రజనీకాంత్ పంచుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఈ వారం థియేటర్లో వినోదాల విందు.. మరి ఓటీటీలో..!
‘కల్కి’ తర్వాత వచ్చిన చిత్రాలేవీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. జులై చివరిలో మరికొన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరి థియేటర్తో పాటు ఓటీటీలో వస్తున్న ఆ చిత్రాలేంటో చూసేయండి. -
రీమేక్ అంటూ నెటిజన్ కామెంట్: స్పందించిన హరీశ్ శంకర్
తన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’పై ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. హరీశ్ శంకర్ స్పందించారు. -
‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అప్పుడే.. దిల్ రాజు ప్రకటన
‘గేమ్ ఛేంజర్’ విడుదలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఏమన్నారంటే? -
ధనుష్ ఇచ్చిన ఛాన్స్.. అదే నాకు అవార్డు: సందీప్ కిషన్ ఎమోషనల్ స్పీచ్
‘రాయన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ ఎమోషనల్గా మాట్లాడారు. ధనుష్పై ప్రశంసలు కురిపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్