Gopichand: రెండు సంస్థలు కలిసి...

గోపీచంద్‌ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

Updated : 28 Mar 2024 12:24 IST

గోపీచంద్‌ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణం కోసం చిత్రాలయం స్టూడియోస్‌తో చేతులు కలిపింది చిత్ర నిర్మాణ సంస్థ  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ. వేణు దోనేపూడి, టి.జి.విశ్వప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘‘గోపీచంద్‌ -  శ్రీనువైట్ల కలయిక ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విభిన్నమైన కథాంశంతోపాటు, ఇంటిల్లిపాదికీ నచ్చే వినోదం ఉన్న చిత్రమిది. అగ్ర నిర్మాణ సంస్థ  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉంది. ఈ షెడ్యూల్‌తో టాకీభాగం చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు. త్వరలోనే హీరోయిన్‌, ఇతర వివరాల్ని ప్రకటించనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఈ చితఆరనికి స్క్రీన్‌ప్లే: గోపీమోహన్‌, సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని