Satish Raj: దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్
తెలుగు తెరపై ఇప్పటి వరకు ఎంతో మంది కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారి వారి ప్రతిభను నిరూపించుకున్నారు.
తెలుగు తెరపై ఇప్పటి వరకు ఎంతో మంది కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారి వారి ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడీ బాటలోకే రాబోతున్నారు నృత్య దర్శకుడు సతీష్ రాజ్. ఆయన స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. శిరీష కథానాయిక. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్ మూవీ జంక్షన్ పేరుతో ఓ బ్యానర్ను స్థాపించారు. తాజాగా సతీష్ ‘సబూరి..’ పేరుతో రూపొందించిన ఓ పాటను, బ్యానర్ లోగోను ప్రముఖ నటుడు మురళీ మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒక దర్శకుడు సినిమా మొత్తాన్ని మూడు గంటల్లో చూపిస్తే కేవలం మూడు నిమిషాల్లో కథ మొత్తం అర్థమయ్యేలా ఒక్క పాటలో చూపించగలిగిన దర్శకుడే కొరియోగ్రాఫర్. సతీష్ లాంటి కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారడం వల్ల చిత్రపరిశ్రమలో మంచి సినిమాలు వస్తాయ’’ని అన్నారు. కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్, శేఖర్ మాస్టర్, విజయ్ బిన్నీ, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, నిర్మాత అర్చన తదితరులు పాల్గొన్నారు.
‘లవ్ మీ...’ ప్రయాణాన్ని మరిచిపోలేం
‘‘కొత్త సినిమాల్ని... కొత్త దర్శకుల్ని అందించాలనే ఈ నిర్మాణ సంస్థని ప్రారంభించాం. ‘బలగం’ తర్వాత ఇందులో రూపొందిన ‘లవ్ మీ’ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు ప్రముఖ నిర్మాత దిల్రాజు. ఆయన నిర్మాణ సంస్థ దిల్రాజు ప్రొడక్షన్స్పై తెరకెక్కిన చిత్రం ‘లవ్ మీ’. ఇఫ్ యు డేర్... అనేది ఉపశీర్షిక. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించారు. అరుణ్ భీమవరపు దర్శకుడు. హన్షిత, హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి నిర్మాతలు. ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్బంగా చిత్రబృందం గురువారం హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘విభిన్నమైన సినిమా చేశామనే పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఈ సినిమా ప్రయాణాన్ని మరిచిపోలేం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కీరవాణి, దిల్రాజు, దర్శకుడు రవికిరణ్ కోలా, నిర్మాత శిరీష్, నటుడు రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ కల్యాణ్కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్.. అదేంటంటే?
తన మామయ్య, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు హీరో సాయి ధరమ్ తేజ ఓ బహుమతి ఇచ్చారు. -
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు స్పెషల్ ఫొటోలు పంచుకుంటూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. -
కొత్త జోడీ... మెరుపులు రెడీ
ఒకసారి హిట్ అనిపించుకుంటే చాలు.. మళ్లీ మళ్లీ ఆ జోడీని తెరపై చూడడానికి ఇష్టపడతారు సినీప్రియులు. దీంతో పాటు తెరపైకి కొత్త కాంబినేషన్లు వస్తున్నాయంటే కూడా అభిమానుల్లో ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. -
టాక్సిక్ కోసం బరిలోకి నయనతార
‘కేజీఎఫ్’ సిరీస్ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
గరం గరం యముడు
‘‘మామూలుగా నాటు అయినా నీటు.. ఎరగడు తడబాటు. మాసు..క్లాసుల మధ్యన ఊగుట వీడికి అలవాటు’’ అంటూ తన వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తున్నాడు సూర్య. -
‘పుష్ప 2’ తేదీకే ‘డబుల్ ఇస్మార్ట్’
‘డబుల్ ఇస్మార్ట్’ విడుదల ఖరారైంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లుగానే ‘పుష్ప 2’ విడుదల తేదీనే ఈ పాన్ ఇండియా చిత్రం లక్ష్యం చేసుకుంది. -
సింగమ్ మళ్లీ వస్తున్నా... ఆలస్యంగానే!
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో.. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సింగమ్ అగైన్’. అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఈ చిత్రంలో పాత్రల ముఖాలు కనిపించవు!
సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా బి.శివప్రసాద్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఏ’.. ఈతరం ప్రేక్షకుల్నీ షాక్కు గురిచేస్తుంది
ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘ఏ’. ఈ సినిమా ఈ నెల 21న తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ కానుంది. -
స్టైలిష్ తాప్సీ.. హాట్ దక్ష.. క్యూట్ అదితి
ఇన్స్టా వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
సీసీఎస్ ప్రక్షాళనకు చర్యలు.. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు
-
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు.. అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం
-
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
-
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?
-
రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి..ఫొటోలు వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM