Nabha Natesh: మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.
ఇంటర్నెట్డెస్క్: ‘ఇస్మార్ట్ శంకర్’తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు నటి నభా నటేశ్ (Nabha Natesh). రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆమె కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి వస్తున్నారు. ఇదిలా ఉండగా.. సోషల్మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే ఈ భామకు నటుడు ప్రియదర్శికి మధ్య తాజాగా జరిగిన సంభాషణ నెట్టింట వైరల్గా మారింది. కామెంట్ చేసేముందు మాటలు సరిచూసుకోవాలంటూ ఆమె ప్రియదర్శికి సూచించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
‘‘హాయ్ డార్లింగ్స్ ఎలా ఉన్నారు!!’’ అంటూ నభా నటేశ్ తాజాగా ఎక్స్లో ఓ సరదా వీడియో షేర్ చేశారు. ప్రభాస్ వాయిస్తో ఆమె దీనిని క్రియేట్ చేశారు. ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీనిపై ప్రియదర్శి స్పందిస్తూ.. ‘‘వావ్ సూపర్ డార్లింగ్.. కిర్రాక్ ఉన్నావు’’ అని రిప్లై ఇచ్చాడు. తనని డార్లింగ్ అని పిలవడంపై నభా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఐపీసీ సెక్షన్ 354A ప్రకారం పరిచయం లేని ఒక మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపులతో సమానం’’ అని రాసి ఉన్న ఒక ఇమేజ్ను షేర్ చేస్తూ.. ‘‘మిస్టర్. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త’’ అని బదులిచ్చారు.
‘‘మనం పరిచయం లేని వ్యక్తులనే విషయం నాకు తెలియదు. మీరైతే డార్లింగ్ అనొచ్చు మేము అంటే మాత్రం సెక్షన్సా? లైట్ తీసుకో డార్లింగ్’’ అని ప్రియదర్శి కామెంట్ చేయగా.. ‘‘ఆహా!! హద్దు దాటి ప్రవర్తించకు. చూసుకుందాం’’ అని సమాధానమిచ్చారు. నెట్టింట వైరల్గా మారిన ఈ చాట్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వీరి మధ్య నిజంగానే మాటల యుద్ధం జరిగిందని అనుకొంటున్నారు. మరి కొంతమంది మాత్రం సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇలా మాట్లాడుకుని ఉంటారని భావిస్తున్నారు.
‘నన్ను దోచుకుందువటే’తో ఈ కన్నడ నటి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘అదిగో’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘డిస్కోరాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’ చిత్రాలతో అలరించారు. నితిన్ హీరోగా నటించిన ‘మ్యాస్ట్రో’ తర్వాత ఆమె సినిమాల్లో కనిపించలేదు. వెండితెరకు దూరంగా ఉండటంపై గతేడాది ఓ లేఖను విడుదల చేశారు. ‘‘కొన్నిరోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 2022లో నాకు రోడ్డు ప్రమాదం జరిగింది. దాని వల్ల నా ఎడమ భుజానికి గాయమైంది. చాలా శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. మానసికంగా, శారీరకంగా భరించలేని బాధను అనుభవించా. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. మళ్లీ సినిమాలతో మిమ్మల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని దానిలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది. -
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
తాను సినిమాలు చేయడం మాననని నటుడు విశాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు.. యూటర్న్ తీసుకున్నా: సూర్య
‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య (Suriya) పాల్గొన్నారు. తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. -
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. అంధులకు బెల్లకొండ శ్రీనివాస్ సాయం
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంధులకు సాయం చేశారు బెల్లకొండ సాయి శ్రీనివాస్ -
ఆయన్ని చూడగానే కన్నీళ్లు ఆగలేదు: తమన్
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) తాజాగా ఓ సంగీత కార్యక్రమంలో మాట్లాడారు. -
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ