ఆ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి దీపిక
డెడ్లైన్స్ గ్లోబల్ డిస్రప్టర్స్ అనే హాలీవుడ్ మ్యాగజైన్ ప్రతీ ఏడాది.. ప్రపంచవ్యాప్తంగా వినోదరంగంలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది. ఇటీవలే విడుదల చేసిన ఈ ఏడాది జాబితాలో ప్రముఖ బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకొణె చోటు దక్కించుకుంది.
డెడ్లైన్స్ గ్లోబల్ డిస్రప్టర్స్ అనే హాలీవుడ్ మ్యాగజైన్ ప్రతీ ఏడాది.. ప్రపంచవ్యాప్తంగా వినోదరంగంలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది. ఇటీవలే విడుదల చేసిన ఈ ఏడాది జాబితాలో ప్రముఖ బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకొణె చోటు దక్కించుకుంది. ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయ నటిగా దీపిక నిలిచింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..కొన్ని ఆసక్తికర విషయాల్ని తన అభిమానులతో పంచుకుంది.
‘నటించిన సినిమా విజయం అందుకోవాలి, బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురవాలి, పాత్ర మెప్పించాలి, సినీ ప్రియులు కథనంతో పాటు సాగిపోయేలా కథలను ఎంపిక చేసుకోవాలి, అవార్డులు ప్రశంసలు దక్కాలి, మంచి స్థాయిలో ఉండాలి..ఇలా ఇవే ముఖ్యమంటారు కొందరు నటీనటులు. నా దృష్టిలో ముఖ్యమైనవి ఏమైనా ఉన్నాయంటే అది ఒక మంచి వ్యక్తిగా ఎదగడం, మంచి వ్యక్తులతో సమయం గడపడం, సెట్లోని అనుభవాలను మర్చిపోలేని జ్ఞాపకాలుగా గుర్తుచేసుకోవడం. ఇవే నాకు ముఖ్యం. ఇప్పుడీ గౌరవానికి కూడా కారణం అదే అని నా అభిప్రాయం’.
ప్రపంచం చాలా చిన్నదైపోయిందని నేను అనుకుంటున్నా. సినీ రంగంలోని పరిశ్రమలన్నీ ఒక్కచోట చేరి ఈ ప్రపంచానికి గొప్ప కథలు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. మనం చెప్పే కథల వల్లే ఈ ప్రపంచంలో మార్పులు వస్తున్నాయని నేననుకోవట్లేదు. ప్రేక్షకులు మెచ్చేలా, ఆశ్చర్యపోయేలా, ఆసక్తికరమైన కథలు మాత్రమే మనం చెబుతున్నాం. అదే జరుగుతుంది కూడా’.
‘ఓం శాంతి ఓం’ సినిమా కోసం నేను అసలు ఆడిషన్ ఇవ్వలేదు. 2007లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రంతోనే నేను బాలీవుడ్కి పరిచయమయ్యా. దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఏ ఆడిషన్ చేయకుండానే నన్ను ఎంపిక చేశారు. ఎందుకలా చేశారని ఆశ్చర్యపోయా(నవ్వుతూ). నాలో నాకే తెలియని ఓ స్టార్ ఉందని చెప్పడం, నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చామని ఈ చిత్రబృందం చెప్పాకా చాలా ఆనందపడ్డా. అలా మొదలైన నా ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నా’.
‘బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లోనూ నన్ను ప్రేక్షకుల ఆదరిస్తున్నారు. పదేళ్ల క్రితం నేను హాలీవుడ్ సినిమాలకు ఆడిషన్ ఇచ్చా. అక్కడంతా కొత్త విధానం. అక్కడి సినిమాలోని నటనకు తగ్గట్టు నేను ఫాన్సీ యాక్టింగ్ స్కూల్లో చేరలేదు, ఇంగ్లిష్ నటనలో శిక్షణ తీసుకోలేదు. కానీ ఒక్కసారి హాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత ఇంగ్లిష్ సినిమాలకి తగ్గ నైపుణ్యాలను నేెర్చుకున్నా’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?