Krishna Chaitanya: ఈ కథకు మూలం మహాభారతమే!
‘‘ప్రతి దర్శకుడిలోనూ ప్రత్యేకంగా ఓ బలం ఉంటుంది. నా బలం భావోద్వేగాలే. గుండెల్ని తాకే అనుభూతిని పంచే భావోద్వేగాలతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాన్ని తీశా’’ అన్నారు కృష్ణచైతన్య.
‘‘ప్రతి దర్శకుడిలోనూ ప్రత్యేకంగా ఓ బలం ఉంటుంది. నా బలం భావోద్వేగాలే. గుండెల్ని తాకే అనుభూతిని పంచే భావోద్వేగాలతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాన్ని తీశా’’ అన్నారు కృష్ణచైతన్య. విష్వక్సేన్ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న చిత్ర విశేషాలివీ..
‘‘పేరు చూసి చాలామంది ఇదొక గ్యాంగ్స్టర్ సినిమానా.. అని అడుగుతున్నారు. గ్యాంగ్స్ ఉన్న సినిమానే తప్ప... ఇది గ్యాంగ్స్టర్ సినిమా కాదు. ఓబు, యాదు, దొరసామి, నానాజీ.. ఇలా నలుగురు ఈ కథలో కీలకం. గోదావరి నేపథ్యం అనగానే కొబ్బరి చెట్లు, పచ్చని వాతావరణంతో అంతా ప్రశాంతం అన్నట్టుగా సినిమాల్లో చూపిస్తుంటారు. నిజానికి అక్కడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాల్నిబట్టి కాకుండా, మనుషుల్నిబట్టే నేరాలు చోటు చేసుకుంటాయి. ఆ ఆలోచనతో పాటు, మహాభారతంలోని ‘నా అనేవాడే నీకు మొదటి శత్రువు’ అనే నాకు ఇష్టమైన మాట ఈ కథకి మూలం. నాకు దొరికిన అవకాశాన్ని, స్వేచ్ఛ ఆధారంగా ఈ కథని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశా’’.
- ‘మొదట ఈ కథని శర్వానంద్, రాశీఖన్నా జంటగా తీయాలనుకున్నా. తీవ్ర భావోద్వేగాలున్న ఈ సినిమాని కొన్నాళ్లు ఆగాక చేస్తే బాగుంటుందన్నారు. ఇది ఆలస్యమైతే ఎక్కువ విరామం వస్తుందనే భయం మొదలైంది. త్రివిక్రమ్ సర్ సూచనతో విష్వక్సేన్కి కథ చెప్పా. అలా ప్రయాణం మొదలైంది. తెలంగాణలో పుట్టి పెరిగిన విష్వక్ నెల రోజుల్లోనే గోదావరి మాండలీకాన్ని నేర్చుకుని రంగంలోకి దిగాడు. చెన్నైలో డీటీఎస్ పనులు చేయిస్తున్నప్పుడు ‘ఓ తెలుగు నటుడి నుంచి ఇంత గాఢమైన నటనని ఊహించలేద’ని చెప్పారు అక్కడివాళ్లు. యువన్ శంకర్రాజా గొప్ప నేపథ్య సంగీతాన్ని అందించారు’’.
- ‘‘పాటల రచయితగా నా వల్ల ఎప్పుడూ ఎవరికీ ఆలస్యమయ్యేది కాదు. రచనలో అయినా, దర్శకత్వం విషయంలో అయినా మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. అయితే ఈ స్థాయిలో ఓ సినిమా చేస్తున్నప్పుడు మన ఇష్టాలు అందరికీ నచ్చవు. అందరికీ నచ్చేలా మన పనితీరుని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది ఈ సినిమాతో నేర్చుకున్నా. అయితే ఆ క్రమంలో అందరికీ నచ్చాలని నా అభిప్రాయాన్ని మాత్రం పూర్తిగా మార్చుకోను. అనుకున్నది అనుకున్నట్టు చేశామని ఏ దర్శకుడైనా చెప్పారంటే అది అబద్ధమనేది నా అభిప్రాయం’’.
- ‘‘బడ్జెట్ పరిమితుల వల్లే నేను ముందు అనుకున్న ‘పవర్పేట’ సినిమా ఆగింది. నేను ఓ మంచి హిట్ సినిమా తీస్తేనే, ఆ కథకి పెట్టుబడి పెట్టే ధైర్యం నిర్మాతలకి వస్తుందని అర్థమైంది. అందుకే ఈ కథ రాసుకుని చేశా. నాకు పవన్కల్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయనతో సినిమా తీయాలనేది నా కల. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కొనసాగింపు కోసం పూర్తిస్థాయి కథ లేదు కానీ, ఓ లైన్ ఉంది. విజయం వచ్చిందంటే ఆ ఉత్సాహంలో కొనసాగింపు కథ ఎంతసేపు? నెల రోజుల్లో రాసేస్తా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల