Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్తో సినిమా ఉంటుంది: సందీప్
తాను దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘యానిమల్’ డిసెంబరు 1న విడుదల కానున్న సందర్భంగా సందీప్ రెడ్డి వంగా పలు ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘అర్జున్రెడ్డి’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్’ (Animal). రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక (Rashmika Mandanna) హీరో, హీరోయిన్లుగా నటించారు. అనిల్ కపూర్, బాబీ దేవోల్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 1న (Animal Release Date) సినిమా విడుదలకానున్న సందర్భంగా సందీప్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. గతంలో తెరకెక్కించిన సినిమా సంగతులతోపాటు కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
సినిమా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది!
ట్రైలర్లో రష్మిక హీరోపై మండిపడే సన్నివేశంపై సందీప్ స్పందిస్తూ.. ‘‘ఆ సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ముందే తెలుసు. భావోద్వేగానికి గురైతే ఎవరైనా పళ్లు బిగించి మాట్లాడడం సహజం. ఎమోషనల్ సీన్ కాబట్టి హీరోయిన్ క్యారెక్టర్ అలా ప్రవర్తించింది. సినిమా చూస్తే ఆ పాత్ర లోతు అర్థమవుతుంది’’ అని అన్నారు.
మహేశ్బాబు, విజయ్లతో సినిమాలు..
‘‘మహేశ్ బాబుకు ఓ పాయింట్ వినిపించా. ఆయన సినిమా చేద్దామని చెప్పిన సమయానికి నేను సిద్ధంగా లేను. స్క్రిప్టు పూర్తి చేసేందుకు చాలా సమయం తీసుకున్నా. మధ్యలో బాలీవుడ్కు వెళ్లా. అలా మా కాంబోలో సినిమా తెరకెక్కలేదు. అంతేగానీ ఆయన నేను చెప్పిన కథను తిరస్కరించలేదు. ఆయనతో తప్పకుండా సినిమా చేస్తా. ఎప్పుడనేది చెప్పలేను. విజయ్ దేవరకొండతోనూ మళ్లీ కలిసి చేయాలని ఉంది’’ అని తెలిపారు.
స్పిరిట్.. ఆసక్తికరం
‘‘ప్రభాస్తో తెరకెక్కించబోయే ‘స్పిరిట్’ సినిమా కథ ఆసక్తికరంగా ఉంటుంది. అది ‘యానిమల్’లా ఎక్కువ నిడివితో రూపొందేది కాదు. 2:25 నుంచి 3 :00 గంటల రన్టైమ్ ఉండొచ్చు’’ అని సందీప్ అంచనా వేశారు.
రణ్వీర్ తిరస్కరించారు..
‘‘కబీర్సింగ్’ (అర్జున్రెడ్డి రీమేక్) సినిమాలో హీరోగా ముందు రణ్వీర్ సింగ్ను అనుకున్నా. కానీ, తనకు సెట్కాదని ఆయన తిరస్కరించారు. దాంతో, షాహిద్ కపూర్ను ఎంపిక చేశా. ప్రస్తుతానికి రీమేక్ మళ్లీ రీమేక్స్ చేయాలనే ఆలోచన లేదు’’ అని తెలిపారు.
ఎవరూ సీరియస్గా తీసుకోలేదా..!
అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావడంపై స్పందిస్తూ.. ‘‘అల్లు అర్జున్కు అవార్డు రావడం ఆనందంగా ఉంది. కానీ, ఇన్నేళ్ల నుంచి ఎవరూ సీరియస్గా తీసుకొని జాతీయ అవార్డులకు అప్లై చేయలేదా?’ అని అనిపించింది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
యానిమల్ సెన్సార్ రిపోర్టు..
తండ్రి, కొడుకుల సెంటిమెంట్తో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన యానిమల్ సినిమా నిడివి 3:21 గంటలు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. సన్నివేశాలు, సంభాషణలు కలిపి మొత్తం ఆరు కట్స్ సూచించినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఐడెంటిటీ మార్చుకోవాల్సి వస్తే: విజయ్ ఆంటోనీ సమాధానమేంటంటే?
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తుఫాన్’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. -
నిహారిక ధైర్యాన్ని మెచ్చుకోవాలి : సిద్ధూ జొన్నలగడ్డ
‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. -
‘దేవర’ సాంగ్ అప్డేట్ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. ఏమన్నారంటే?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమా సాంగ్ అప్డేట్ ఇచ్చారు శేఖర్ మాస్టర్. -
నిజమైన సింహంతో ఫస్ట్ ఆసియా ఫిల్మ్.. ‘మాంబో’!
‘అరణ్య’తో అలరించిన దర్శకుడు ప్రభు సాల్మన్ మరో సరికొత్త ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. -
తనే నిజం చెబితే బాగుంటుంది: రాజ్ తరుణ్ ఇష్యూపై డైరెక్టర్ రవికుమార్
రాజ్ తరుణ్ ఇష్యూపై దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ స్పందించారు. రాజ్ తరుణ్ హీరోగా రవికుమార్ తెరకెక్కించిన చిత్రం ‘తిరగబడర సామీ’ త్వరలోనే విడుదల కానుంది. -
అందుకే రాజ్ తరుణ్ను హీరోగా తీసుకున్నా: ‘పురుషోత్తముడు’ డైరెక్టర్
రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన తెరకెక్కించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ప్రచారంలో భాగంగా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
రాజ్తరుణ్ వల్ల ‘పురుషోత్తముడు’ బిజినెస్ లాస్ అయిందా?.. నిర్మాత ఏమన్నారంటే!
‘పురుషోత్తముడు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. రాజ్తరుణ్ వల్ల సినిమా బిజినెస్ లాస్ అయిందా?అనే ప్రశ్నకు నిర్మాత రమేశ్ సమాధానమిచ్చారు. -
‘రాజాసాబ్’పై తమన్ ఆసక్తికర కామెంట్స్.. ఏం అప్డేట్ ఇచ్చారంటే?
ప్రభాస్ ‘రాజాసాబ్’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. -
లీక్స్పై స్పందించిన ‘వీడీ 12’ టీమ్.. సోషల్ మీడియాలో పోస్ట్
లీక్స్ రావడంపై ‘వీడీ 12’ టీమ్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. -
అది చిన్న విషయం కాదు: ‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్పై పూరి జగన్నాథ్
తన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’లోని ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రత్యేకంగా మాట్లాడారు. -
హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా?: ప్రశ్నించిన అనిల్ రావిపూడి
హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా? అని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశ్నించారు. ఏం జరిగిందంటే? -
ఎన్టీఆర్పై ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రశంసలు: ‘దేవర’ సాంగ్ గురించి ఏమన్నారంటే?
టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్పై కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. -
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబో.. సర్ప్రైజ్ అదిరింది
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘సూర్య 44’ (వర్కింగ్ టైటిల్). సూర్య పుట్టినరోజు సందర్భంగా టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది. -
వీటి ఆధారంగా ‘కల్కి’ రెండు భాగాలు: ఫొటో పంచుకున్న నాగ్ అశ్విన్
‘కల్కి 2898 ఏడీ’ సినిమాకి సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఫొటో పోస్ట్ చేశారు. -
ఆర్ఆర్ఆర్ను బీట్ చేసిన కల్కి 2898 ఏడీ.. వసూళ్లు ఎంతంటే?
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లను అధిగమించింది. -
రెండు సినిమాల అప్డేట్స్ చెప్పిన రజనీకాంత్.. ‘ఇండియన్ 2’ గురించి ఏమన్నారంటే!
తన అప్కమింగ్ సినిమాల అప్డేట్లను రజనీకాంత్ పంచుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఈ వారం థియేటర్లో వినోదాల విందు.. మరి ఓటీటీలో..!
‘కల్కి’ తర్వాత వచ్చిన చిత్రాలేవీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. జులై చివరిలో మరికొన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరి థియేటర్తో పాటు ఓటీటీలో వస్తున్న ఆ చిత్రాలేంటో చూసేయండి. -
రీమేక్ అంటూ నెటిజన్ కామెంట్: స్పందించిన హరీశ్ శంకర్
తన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’పై ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. హరీశ్ శంకర్ స్పందించారు. -
‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అప్పుడే.. దిల్ రాజు ప్రకటన
‘గేమ్ ఛేంజర్’ విడుదలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఏమన్నారంటే? -
ధనుష్ ఇచ్చిన ఛాన్స్.. అదే నాకు అవార్డు: సందీప్ కిషన్ ఎమోషనల్ స్పీచ్
‘రాయన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ ఎమోషనల్గా మాట్లాడారు. ధనుష్పై ప్రశంసలు కురిపించారు.