Sukumar: ‘గౌడ్‌ సాబ్‌’ కథ విని ఆశ్చర్యపోయా: సుకుమార్‌

కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ మాస్టర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఇందులో ప్రభాస్‌ కజిన్ విరాట్‌ రాజ్ హీరోగా నటిస్తున్నారు.

Published : 10 Apr 2024 16:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృష్ణంరాజు కుటుంబం నుంచి మరో హీరో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రభాస్‌ కజిన్‌ విరాట్‌ రాజ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ మాస్టర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘గౌడ్‌ సాబ్‌’ (Goud Saab)పేరుతో ఇది రానుంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గణేశ్‌ మాస్టర్‌ తనకు కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.

‘‘జగడం’తో గణేశ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాను. మొదటి సినిమాలోనే అద్భుతాలు సృష్టించాడు. ప్రతీ మూమెంట్ కొత్తగా అనిపించేది. ‘పుష్ప’లో కూడా ‘ఏ బిడ్డ..’ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేశాడు. ఇండస్ట్రీ ఉన్నంతవరకు గణేశ్‌ ఉంటాడు. తన ప్రతీ పాటలో సినిమా కథను చూపిస్తాడు. డైరెక్టర్‌ అవుతున్నాడంటే నేను షాక్‌ అవ్వలేదు. కానీ, ఈ స్టోరీ లైన్‌ విన్న తర్వాత ఆశ్చర్యపోయాను. ఈ టైటిల్లో కూడా ట్విస్ట్‌ ఉంది. నేను కథను నమ్ముతాను. ‘గౌడ్‌ సాబ్‌’ కథ మొత్తం విన్నాను. ఈ సినిమా నిజంగా గొప్ప విజయం సాధిస్తుంది. నిర్మాతలకు మంచి లాభాలను తెస్తుంది’ అంటూ చిత్రబృందానికి సుకుమార్‌ అభినందనలు తెలిపారు. విరాట్‌ భవిష్యత్తులో గొప్ప హీరో అవుతాడని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి అన్నారు. అతడంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టమన్నారు.

గణేశ్‌ మాస్టర్‌ మాట్లాడుతూ.. ‘నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం పవన్‌కల్యాణ్‌. ఆయన నన్నెంతో ప్రోత్సహించారు. త్రివిక్రమ్‌, అనిల్‌ రావిపూడి కూడా నాకు అవకాశాలిచ్చారు. ఇద్దరు ట్రూలవర్స్‌ స్టోరీనే ‘గౌడ్‌ సాబ్‌’. ఈ కథ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని