Vignesh Shivan: నయనతారతో టూర్‌.. ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టిన విఘ్నేశ్‌ శివన్‌

దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.

Published : 01 Jun 2024 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan)- హీరోయిన్‌ నయనతార (Nayanthara) దంపతులు తమ పిల్లలతో కలిసి విహారయాత్రలు చేస్తున్నారు. సంబంధిత ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ పోస్ట్‌ పెడుతూ విఘ్నేశ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. హాంకాంగ్‌లోని డిస్నీల్యాండ్‌ రిసార్ట్‌లో దిగిన స్టిల్స్‌ షేర్‌ చేస్తూ.. గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ‘‘12 ఏళ్ల క్రితం ‘పోడా పోడి’ సినిమా షూటింగ్‌కు అనుమతి కోరడానికి వచ్చా. అప్పుడు నా జేబులో రూ.1000 ఉన్నాయి. షూస్‌ కూడా లేవు. చెప్పులే వేసుకున్నా. ఇన్నేళ్ల తర్వాత నా భార్య, పిల్లలతో కలిసి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. కష్టం ఎప్పుడూ వృథా పోదు అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల రూపంలో విఘ్నేశ్‌ను అభినందిస్తున్నారు.

విఘ్నేశ్‌ దర్శకుడిగా వ్యవహరించిన తొలి చిత్రమే ‘పోడా పోడి’. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఈ సినిమాతోనే హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. విఘ్నేశ్‌.. ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ‘టెస్ట్‌’, ‘మన్నంగట్టి సిన్స్‌ 1960’, ‘డియర్‌ స్టూడెంట్స్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు నయనతార.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని