Maruthi: ఆ సినిమా మా జీవితాలను మార్చేసింది: మారుతి

మారుతి (Maruthi) దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఈ రోజుల్లో’ (Ee rojullo). శనివారం ఈ సినిమా రీ రిలీజ్‌ కానుంది.

Published : 22 Mar 2024 18:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దర్శకుడు మారుతి ఇండస్ట్రీకి పరిచయమైన తొలి చిత్రం ‘ఈ రోజుల్లో’. శ్రీనివాస్‌, రేష్మా రాథోడ్‌ ప్రధాన పాత్రధారుల్లో నటించారు. రొమాంటిక్‌ కామెడీ కథతో దీనిని తీర్చిదిద్దారు. 2012లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా రీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంతో తమ జీవితాలు మారాయన్నారు.

‘‘దర్శకుడిగా తొలిసారి మెగా ఫోన్‌ పట్టింది ‘ఈ రోజుల్లో’ చిత్రంతోనే. దాదాపు 12 ఏళ్ల తర్వాత రీ రిలీజ్‌ చేస్తున్నాం. అతి తక్కువ బడ్జెట్‌లో సరదాగా దీనిని తెరకెక్కించాం. ఈ సినిమాతో మా జీవితాలెంతో మారాయి. గోకుల్‌ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశా. ఆరోజు వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు నాకింకా గుర్తున్నాయి. ఇది అందించిన ఆదరణను మాటల్లో వర్ణించలేను’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని