Akshay Kumar: 200 గుర్రాలతో భారీ యాక్షన్
హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘వెల్కమ్ టు ది జంగిల్’ ఒకటి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది.
హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘వెల్కమ్ టు ది జంగిల్’ ఒకటి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ‘వెల్కమ్’ ఫ్రాంచైజీలో రానున్న ఈ మూడో భాగంలో దిశా పటానీ, రవీనా టాండన్, జాక్వెలెన్ ఫెర్నాండజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ముంబయిలో ఓ భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తైనట్లు సమాచారం. ‘దాదాపు 200 గుర్రాలతో పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ని చిత్రీకరించారు. ఏడు రోజుల పాటు జరిగిన ఈ షూటింగ్లో సన్నివేశాల్ని మునుపెన్నడూ చూడని విధంగా తీర్చిదిద్దారు. పది ఎకరాల స్థలంలో భారీ సెట్ వేసి ఈ ఘట్టాల్ని రూపొందించారు’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబరు 20న ఈ సినిమా అభిమానుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త జోడీ... మెరుపులు రెడీ
ఒకసారి హిట్ అనిపించుకుంటే చాలు.. మళ్లీ మళ్లీ ఆ జోడీని తెరపై చూడడానికి ఇష్టపడతారు సినీప్రియులు. దీంతో పాటు తెరపైకి కొత్త కాంబినేషన్లు వస్తున్నాయంటే కూడా అభిమానుల్లో ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. -
టాక్సిక్ కోసం బరిలోకి నయనతార
‘కేజీఎఫ్’ సిరీస్ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
గరం గరం యముడు
‘‘మామూలుగా నాటు అయినా నీటు.. ఎరగడు తడబాటు. మాసు..క్లాసుల మధ్యన ఊగుట వీడికి అలవాటు’’ అంటూ తన వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తున్నాడు సూర్య. -
‘పుష్ప 2’ తేదీకే ‘డబుల్ ఇస్మార్ట్’
‘డబుల్ ఇస్మార్ట్’ విడుదల ఖరారైంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లుగానే ‘పుష్ప 2’ విడుదల తేదీనే ఈ పాన్ ఇండియా చిత్రం లక్ష్యం చేసుకుంది. -
సింగమ్ మళ్లీ వస్తున్నా... ఆలస్యంగానే!
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో.. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సింగమ్ అగైన్’. అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఈ చిత్రంలో పాత్రల ముఖాలు కనిపించవు!
సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా బి.శివప్రసాద్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఏ’.. ఈతరం ప్రేక్షకుల్నీ షాక్కు గురిచేస్తుంది
ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘ఏ’. ఈ సినిమా ఈ నెల 21న తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ కానుంది. -
స్టైలిష్ తాప్సీ.. హాట్ దక్ష.. క్యూట్ అదితి
ఇన్స్టా వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
-
నీతి ఆయోగ్ చెప్పిందదే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు
-
తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!
-
స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలుపు.. సూపర్8కు ఇంగ్లాండ్
-
దేశవ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్ ప్రాథమిక పరీక్ష