సంక్షిప్త వార్తలు(4)
జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం గెలుచుకున్నాకా బాలీవుడ్ యువ కథానాయకుడు విక్కీ కౌశల్ మరింత జాగ్రత్తగా పాత్రల్ని ఎంచుకుం టున్నారు.
‘సామ్ బహదూర్’ ఆగమనం
జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం గెలుచుకున్నాకా బాలీవుడ్ యువ కథానాయకుడు విక్కీ కౌశల్ మరింత జాగ్రత్తగా పాత్రల్ని ఎంచుకుం టున్నారు.అలా ఎంచుకున్న పాత్రే ‘సామ్ బహదూర్’ చిత్రంలోనిది. ఆర్మీ అధికారి సామ్ మానెక్షా జీవిత కథతో వస్తోన్న ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకురాలు కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే ఆమె దర్శకత్వం వహించిన ‘రాజీ’ మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ‘సామ్ బహదూర్’ను వచ్చే ఏడాది డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో సామ్ భార్య సిల్లూగా సాన్యా మల్హోత్ర, దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీగా ఫాతిమా సనా షేక నటిస్తున్నారు. ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ పొందిన తొలి భారతీయ ఆర్మీ అధికారి సామ్ మానెక్షా.
రాజ్తరుణ్.. ‘తిరగబడరా సామి’!
‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి విజయవంతమైన చిత్రాలతో మెప్పించిన దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి. ఇప్పుడాయన రాజ్తరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. దీనికి ‘తిరగబడరా సామి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సి.కల్యాణ్ క్లాప్ కొట్టగా.. కె.ఎస్.రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. పోకూరి బాబూరావు దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. ‘‘కొత్తదనం నిండిన కథాంశంతో చక్కటి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందించనున్నాం. రాజ్తరుణ్ సరికొత్తగా కనిపిస్తారు. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: జె.బి, ఛాయాగ్రహణం: జవహర్ రెడ్డి.
మూడోసారి సింగం గర్జన
అజయ్దేవ్గణ్ను యాక్షన్ అభిమానులకు మరింత దగ్గర చేశాయి ‘సింగం’ చిత్రాలు. ‘సింగం’, ‘సింగం రిటర్న్’ చిత్రాల్లో పోలీస్ పాత్రలో నటించి బాక్సాఫీసు వద్ద వసూళ్లు కురిపించారు అజయ్. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా ‘సింగం ఎగైన్’ రాబోతుంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం గత రెండు చిత్రాలను మించి ఉంటుందని తెలుస్తోంది.
హృదయాల్ని హత్తుకునే ‘ముఖచిత్రం’
వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ముఖచిత్రం’. గంగాధర్ దర్శకుడు. ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల సంయుక్తంగా నిర్మించారు. హీరో విష్వక్ సేన్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లో చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. చిత్ర దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ.. ‘‘ఇది చిన్న చిత్రమైనా.. విష్వక్ సేన్ వచ్చాక పెద్ద సినిమాగా మారింది’’ అన్నారు. ‘‘మంచి భావోద్వేగభరితమైన సినిమా చేశాం. కచ్చితంగా అందరి హృదయాల్ని హత్తుకునేలా ఉంటుంది’’ అంది నాయిక ప్రియా వడ్లమాని.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్