ఆ రోజే నేను నటుడిగా మళ్లీ పుట్టా!
‘‘తెలుగు సినిమా అగ్రస్థానంలో ఉంది. నటులందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ ఆ స్థానాన్ని అలా నిలబెట్టాల’’ని పిలుపునిచ్చారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్.
‘దాస్ కా ధమ్కీ’ వేడుకలో ఎన్టీఆర్
‘‘తెలుగు సినిమా అగ్రస్థానంలో ఉంది. నటులందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ ఆ స్థానాన్ని అలా నిలబెట్టాల’’ని పిలుపునిచ్చారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్. ఆయన శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ‘దాస్ కా ధమ్కీ’ ముందస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విష్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. నివేతా పేతురాజ్ కథానాయిక. కరాటే రాజు నిర్మాత. ఉగాది సందర్భంగా ఈ నెల 22న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో ఎన్టీఆర్ ప్రసంగించారు. ప్రపంచ పటంలో ‘ఆర్ఆర్ఆర్’ నిలబడిందంటే, ఆస్కార్ చేజిక్కించుకుందంటే మేము, మా బృందం ఎంత కారణమో తెలుగు చలన చిత్ర పరిశ్రమ, భారతీయ చిత్ర పరిశ్రమ అంతే కారణం. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమ కూడా అంతే కారణం. ఆ సినిమాకి పనిచేసిన మేం కాదు పురస్కారం సొంతం చేసుకున్నది. ప్రేక్షకులకు బదులు మేం అక్కడున్నాం. ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ కాకుండా... ఇద్దరు భారతీయులు, ఇద్దరు తెలుగువాళ్లు కనిపించారు. ఆ వేదిక మొత్తం తెలుగుదనం ఉట్టిపడింది. మీరు టీవీల్లో చూసి ఎంత ఉత్సాహం పొందారో, నేను రెండు కళ్లతో చూస్తూ అంత ఆస్వాదించా. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘ఆర్ఆర్ఆర్’ ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమాలు, భారత సినిమాలు మరింత ముందుకు సాగాలని దేవుడిని కోరుకుంటున్నా. విష్వక్ సేన్ వేదికపై మాట్లాడినట్టు నేనెప్పటికీ మాట్లాడలేను. అంత ఉత్సాహం తనలో ఉంటుంది. ఎప్పట్నుంచో నాపైన ఉన్న బాధ్యతతో ఇక్కడికి వచ్చా. నాకు బాగా ఇష్టమైన సినిమాలు తక్కువగా ఉంటాయి. అందులో విష్వక్ నటించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చాలా ముఖ్యమైనది. అందులో విష్వక్, అభినవ్ నటనని చూస్తూ ఉండిపోతుంటా. ముఖ్యంగా విష్వక్ని. ఒక నటుడిగా కామెడీ చేయకుండా కామెడీ పండించాడు తను. ఎంత కామెడీ పండిస్తాడో అంతే బాధని దిగమింగుకుని కనిపిస్తుంటాడు. ఒక కొత్త నటుడికి చాలా ఆత్మవిశ్వాసం ఉండాలి అలాంటి పాత్రలు చేయాలంటే. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ, తనకి చాలా మంచి చేసింది. ఆ సినిమా తర్వాత ‘ఫలక్నామాదాస్’ చూశా. నటుడిగా తనెంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడో దర్శకుడిగా కూడా అంతే. చాలా బాగా చేశాడు. ‘పాగల్’ కూడా చేశాడు. తనొక ఛట్రంలోకి వెళ్లిపోతాడా అనుకున్నప్పుడు ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ చేశాడు. ఆ సినిమా చూసినప్పుడు షాక్ అయ్యా. ఇంతగా మారిపోయాడు అనిపించింది. నేను నటుడిగా అలా మారడానికి చాలా కాలం పట్టింది. నటుడిగా నేను ఆనందపడే సినిమాలు చేయాలని ఆలస్యంగా అనుకున్నా. ఆ రోజే ఈ వేదికపైనే మీరంతా కాలర్ దించుకోకుండా చేస్తానని చెప్పా. అందరికీ ఆ వాగ్ధానం చేసిన రోజే నేను నటుడిగా మళ్లీ పుట్టా. విష్వక్ ఎప్పుడూ ఏదో ఒకటి నిరూపించుకోవాలనే తపనతో కనిపిస్తుంటాడు. ఈ చిత్రం నిజంగా బ్లాక్బస్టర్ కావాలి. ఈ సినిమాతో తను ఘన విజయం సాధించి దర్శకత్వం చేయడం నిలిపేయాలని కోరుకుంటున్నా. బయట ఔత్సాహికులైన యువ దర్శకులు బోలెడు మంది ఉన్నారు. విష్వక్తోపాటు మాలాంటివాళ్లంతా ఆ దర్శకులకి అవకాశం ఇవ్వాలి. విష్వక్ నాతో మాట్లాడుతూ ‘ఉన్నదంతా పెట్టేశాను ఈ సినిమా కోసం’ అని చెప్పాడు. ఒక మంచి సినిమా చేయాలనే పిచ్చి తనకెంతగా ఉందో అప్పుడు అర్థమైంది. ఇలాంటి పిచ్చి ఉన్నవాళ్లే పరిశ్రమని ముందుకు తీసుకెళతారు. ఇలాంటివాళ్ల చిత్రాలు ఆడాలి, అప్పుడే మనం ముందుకు వెళతాం. మార్చి 22న విడుదలవుతుందీ చిత్రం. ఈ ఉగాది పండుగ రోజు విష్వక్కి నిజమైన పండుగ రావాలని మనసారా కోరుకుంటున్నా. తను ఇంకా మంచి సినిమాలు చేయడానికి ఇది మొదటి మెట్టు కావాలి. నటులు, సాంకేతిక నిపుణులు అందరికీ నా శుభాకాంక్షలు’’ అన్నారు. విష్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘నాలో ఒక అభిమానిని చూసుకుని... నాకు ఇచ్చిన మాట కోసం వచ్చారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ వస్తున్నాడంటే కూడా చాలా మంది నమ్మలేదు. భారతదేశంలో ఉత్తమ నటుడు ఎవరంటే ఎన్టీఆర్ అని నేనెప్పుడో చెప్పా. 17 ఏళ్లకే తొడగొట్టారు ఎన్టీఆర్. ఉన్నదంతా పెట్టి నేను సొంతంగా నిర్మించిన చిత్రమిది. ‘వీడికి ఉన్నదంతా పోగొట్టుకుంటే వెక్కిరిద్దాం, నవ్వుదాం’ అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. దేవుడు ఇవన్నీ చూస్తుంటాడు కాబట్టే ఎన్టీఆర్ని పంపించారు. నాకు బ్లాక్ బస్టర్ మొదలైంది’’అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్ బెజవాడ, రామ్ తాళ్లూరి, హను రాఘవపూడి, సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్, కళా దర్శకుడు రామాంజనేయులు, ఛాయాగ్రాహకుడు దినేష్, పృథ్వీ రాజ్, రవి, యశ్, కాసర్ల శ్యామ్, పూర్ణాచారి, మంగ్లీ, మహేష్, హైపర్ ఆది, అమిత్ శర్మ, బి.వి.ఎస్.రవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!