Tollywood: సెప్టెంబరులో 6 పాన్ ఇండియా సినిమాలు
తెలుగు చిత్రసీమలో నూతనోత్తేజాన్ని నింపింది ఈ నెల. ఆరంభంలో అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ‘జైలర్’తో బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపిస్తే..
తెలుగు చిత్రసీమలో నూతనోత్తేజాన్ని నింపింది ఈ నెల. ఆరంభంలో అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ‘జైలర్’తో బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపిస్తే.. నెలాఖరున ‘బెదురులంక 2012’, ‘బాయ్స్ హాస్టల్’ లాంటి చిన్న చిత్రాలు మెరుపులు మెరిపించాయి. ఇప్పుడీ విజయోత్సాహంలోనే ఆగస్టుకు వీడ్కోలు పలుకుతూ సెప్టెంబరు పోరుకు సిద్ధమవుతోంది తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ నెలలో దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ ముందు వరుస కడుతుండటం.. ప్రభాస్, షారుక్ ఖాన్, విజయ్ దేవరకొండ, రామ్ లాంటి స్టార్లు పోటీ పడుతుండటం సినీప్రియుల్ని ఊరిస్తోంది. మరి వీటిలో హిట్టు మాట వినిపించి.. వసూళ్ల వర్షం కురిపించేవి ఏవి? అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.
సెప్టెంబరు తొలివారంలో విజయ్ దేవరకొండ - సమంతల ‘ఖుషి’తో పాటు ‘నా..నీ.. ప్రేమకథ’ అనే మరో చిన్న చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే వీటిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ‘ఖుషి’నే. విజయ్ - సామ్ జంటగా శివ నిర్వాణ రూపొందించిన ఈ ప్రేమ కథా చిత్రం సెప్టెంబరు 1న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో మంచి వసూళ్లు సాధించే అవకాశమున్నట్లు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
‘జవాన్’తో శెట్టి పోరు..
షారుక్ ఖాన్ ‘జవాన్’, నవీన్ పొలిశెట్టి - అనుష్కల ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్ట¨’ సెప్టెంబరు 7న బాక్సాఫీస్ ముందు తలపడనున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ‘పఠాన్’తో రూ.1000కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించి బాలీవుడ్కు కొత్త కళ తీసుకొచ్చారు షారుక్. అంతటి భారీ విజయం తర్వాత ఆయన నుంచి రానున్న సినిమా కావడంతో ‘జవాన్’పై ఇటు ప్రేక్షకుల్లోనూ.. అటు సినీ వర్గాల్లోనూ భారీస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. దాదాపు రూ.300కోట్ల భారీ బడ్జెట్తో అట్లీ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో నయనతార కథానాయికగా కనిపించనుండగా.. విజయ్ సేతుపతి ప్రతినాయక పాత్ర పోషించారు. తమిళ స్టార్ విజయ్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇందులో అతిథి పాత్రల్లో తళుక్కున మెరవనున్నట్లు సమాచారం. ఇక ‘జవాన్’ బాటలోనే పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంపైనా మంచి అంచనాలున్నాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ లాంటి విజయాల తర్వాత నవీన్ నటించిన చిత్రమిది. పి.మహేష్ తెరకెక్కించారు. భిన్న వయసులున్న ఓ జంట మధ్య సాగే సరికొత్త ప్రేమకథతో ఈ చిత్రం రూపొందింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు వినోదాత్మకంగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
చవితి బరిలో గెలుపెవరిదో?
ఈ వినాయక చవితి పసందైన వినోదాలతో కనువిందు చేయనుంది. ఈ సారి బాక్సాఫీస్ బరిలో రామ్, విశాల్, లారెన్స్ల మధ్య ముక్కోణపు పోటీ కనిపించనుంది. ‘అఖండ’ లాంటి విజయం తర్వాత ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను.. రామ్తో రూపొందించిన సినిమా ‘స్కంద’. ఇది ఈ ఇద్దరికీ తొలి పాన్ ఇండియా ప్రయత్నమే. మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ రెండు కోణాలున్న పాత్ర పోషించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక. సయీ మంజ్రేకర్ మరో నాయికగా నటించింది. ఇక లారెన్స్ - కంగనా రనౌత్ కలిసి నటించిన ‘చంద్రముఖి 2’, విశాల్ - అధిక్ రవిచంద్రన్ కలయికలో రూపొందిన ‘మార్క్ అంథోని’ చవితి బరిలోనే అదృష్టం పరీక్షించుకోనున్నాయి. వీటిలో లారెన్స్ సినిమా రజనీకాంత్ హిట్ సినిమా ‘చంద్రముఖి’కి కొనసాగింపుగా రూపొందగా, విశాల్ చిత్రం ఓ వినూత్నమైన ట్రైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కింది. మరి సెప్టెంబరు 15న థియేటర్లలోకి అడుగుపెడుతున్న ఈ మూడు సినిమాల్లో విజయ ఢంకా మోగించేది ఏదన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఈ మూడింటికి రెండు వారాల లాంగ్ వీకెండ్ దొరకడం.. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు కొల్లగొట్టే అవకాశముందని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కళ్లన్నీ ‘సలార్’పైనే..
రెండేళ్లుగా సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ‘కేజీఎఫ్’ విజయాల తర్వాత ప్రశాంత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఇందులో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటించడం.. ‘కేజీఎఫ్’ యూనివర్స్ నుంచి వస్తున్న చిత్రమని వార్తలు వినిపిస్తుండటం ఈ అంచనాల్ని రెట్టింపు చేస్తున్నాయి. ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ సినిమాలతో చేదు ఫలితాలందుకున్న ప్రభాస్ దీనిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇది రెండు భాగాలుగా విడుదల కానుండగా.. తొలి భాగం ‘సలార్ పార్ట్1: సీజ్ ఫైర్’ పేరుతో సెప్టెంబరు 28న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అదే రోజున వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ కూడా విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
Gurucharan Singh: బాలీవుడ్లో ప్రముఖ టీవీ నటుడు ఐదు రోజులుగా కన్పించకుండా పోవడం చర్చనీయాంశమైంది. అతడిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం