విజయ్ కుమారుడి దర్శకత్వంలో దుల్కర్?
సినీతారలు తెరపై సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటే.. వారి పిల్లలు మాత్రం దర్శకత్వం వైపు మొగ్గుచూపుతున్నారు. అందులో ఒకరే తమిళ అగ్రకథానాయకుడు విజయ్ కుమారుడు జాసన్ సంజయ్. గతేడాది ఆగస్టులో ఆయన ఓ సినిమాకి త్వరలోనే దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
సినీతారలు తెరపై సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటే.. వారి పిల్లలు మాత్రం దర్శకత్వం వైపు మొగ్గుచూపుతున్నారు. అందులో ఒకరే తమిళ అగ్రకథానాయకుడు విజయ్ కుమారుడు జాసన్ సంజయ్. గతేడాది ఆగస్టులో ఆయన ఓ సినిమాకి త్వరలోనే దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఆ చిత్రంలో ప్రముఖ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’, ‘థగ్ లైఫ్’ చిత్రీకరణలతో బిజీగా ఉన్న దుల్కర్ తదుపరి సినిమాని జాసన్ సంజయ్ తెరకెక్కించేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఆ వార్త ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచుతోంది. చిత్ర విషయాల్ని ఇతర నటీనటుల వివరాల్ని త్వరలోనే వెల్లడించనున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దుల్కర్ ఈ చిత్రంలో భాగం అవుతున్నారో లేదో జాసన్ అధికారికంగా పేర్కొనే వరకూ వేచి చూడాల్సిందే.
సేనాపతి వచ్చేది మేలో
వేేసవిలో సందడి కోసం వడివడిగా ముస్తాబవుతున్నాడు భారతీయుడు. మే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కమల్హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. కాజల్, రకుల్ప్రీత్ సింగ్, ప్రియ భవానీ శంకర్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1996లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘భారతీయుడు’కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 28 ఏళ్లవుతున్నా కమల్ చేసిన సేనాపతి పాత్ర గుర్తుండిపోయింది. రెండోసారి ఆ పాత్రతో ఆయన తెరపై సందడి చేయనున్నారు. దేశం కోసం ఈసారి సేనాపతి ఏమేం చేశాడో, ఎలాంటి సందేశం ఇచ్చాడో తెలియాలంటే వేసవి వరకూ ఆగాల్సిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: శ్రీకర్ప్రసాద్, సంగీతం: అనిరుధ్, ఛాయాగ్రహణం: రవివర్మన్.
భయపెట్టే తంత్రం
అనన్య నాగళ్ల ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘తంత్ర’. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. నరేశ్ బాబు.పి, రవిచైతన్య నిర్మాతలు. త్వరలోనే ట్రైలర్ని విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ‘‘భయపెట్టే అంశాలతో రూపొందిన చిత్రమిది. పల్లెటూరి అమ్మాయిగా అనన్య నాగళ్ల అభినయం ఆకట్టుకుంటుంది. ఆమెకి జోడీగా ధనుష్ రఘుముద్రి బలమైన పాత్రలో కనిపిస్తారు. సెన్సార్ బృందం ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. హారర్ అంశాలున్న ఈ చిత్రాన్ని చూడటానికి చిన్న పిల్లలు రావొద్దని మేం ప్రచారం చేస్తున్నామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. సలోనీ, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయిరామ్ ఉదయ్, విజయ్ భాస్కర్ సద్దాల, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్.
నవ్వులు పంచే లైన్ మ్యాన్
‘లైన్ మ్యాన్’గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు త్రిగుణ్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని వి.రఘుశాస్త్రి తెరకెక్కించారు. పర్పుల్ రాక్ ఎంటర్టైనర్స్ సంస్థ నిర్మించింది. కాజల్ కుందెర్ కథానాయిక. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో మార్చి 15న విడుదల కానుంది. ఈ మేరకు ఇటీవల ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ‘‘మాండ్య సమీప గ్రామాల్లోని వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ.. ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమాని రూపొందించాం. ఓ లైన్ మ్యాన్ జీవితంలోని పలు ఆసక్తికరమైన అంశాల్ని దీంట్లో చూపించనున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: కాద్రి మణికాంత్, ఛాయాగ్రహణం: శాంతి సాగర్ హెచ్.జి.
‘ఆపరేషన్ వాలెంటైన్’లో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు