Cinema News: నాయకా.. సెట్లో ఎప్పుడు నీ రాక!
అభిమాన కథానాయకుల నుంచి కొత్త కబురు వినిపించిందంటే సినీప్రియుల్లో ఓ నూతనోత్సాహం కనిపిస్తుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన సినీతారలు ఓ సినిమా సెట్స్పై ఉండగానే మరో కబురు వినిపించే ప్రయత్నం చేస్తుంటారు.
నెలలు గడుస్తున్నా కొత్త కబురు వినిపించని యువ హీరోలు
అభిమాన కథానాయకుల నుంచి కొత్త కబురు వినిపించిందంటే సినీప్రియుల్లో ఓ నూతనోత్సాహం కనిపిస్తుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన సినీతారలు ఓ సినిమా సెట్స్పై ఉండగానే మరో కబురు వినిపించే ప్రయత్నం చేస్తుంటారు. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర కథానాయకుల మొదలు.. నాని, నాగచైతన్య తదితర యువహీరోల వరకు కొత్త చిత్రాల విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చేశారు. ఇప్పుడు వీళ్ల సినిమాలు ఓ వైపు సెట్స్పై ముస్తాబవుతుండగానే.. మరోవైపు కొత్త కలయికల కబుర్లు ప్రచారంలో వినిపిస్తూ ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి. అయితే ఇప్పటికీ తెలుగులో పలువురు హీరోల సినిమాల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. దీంతో వాళ్ల కొత్త చిత్ర విశేషాలేంటి? ఎప్పట్నుంచి సెట్స్లోకి అడుగు పెడతారన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
వైవిధ్యభరితమైన కథలతో వినోదాలు పంచుతూ సినీప్రియుల్ని మెప్పించిన కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ఆయన గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో బాక్సాఫీస్ ముందు జోరు చూపించిన సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత ఆయన నుంచి రానున్న చిత్రమేదన్నది ఇంకా తేలలేదు. నిజానికి తను గతేడాది చివర్లో ఓ కొత్త కబురు వినిపించారు. సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ అనే చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించినా.. దాని పురోగతి ఏంటన్నది ఇంత వరకు తెలియలేదు. ప్రస్తుతానికైతే తేజు కోసం దర్శకుడు కిషోర్ తిరుమల ‘చిత్రలహరి 2’ స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. కథానాయకుడు అఖిల్ తదుపరి చిత్ర విషయంలోనూ ఇదే సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన గతేడాది ‘ఏజెంట్’తో బాక్సాఫీస్ ముందు సందడి చేయగా.. అది చేదు ఫలితాన్ని ఇచ్చింది. దీంతో తను కథల ఎంపికలో పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. అందుకే ఆయన నుంచి సినిమా వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్నా.. తదుపరి చిత్రంపై స్పష్టత రాలేదు. యూవీ క్రియేషన్స్లో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయనున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ, అదెప్పుడు కార్యరూపం దాల్చుతుందన్నది తేలలేదు.
ఆచితూచి అడుగులు
‘ఉప్పెన’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మెరిసిన కథానాయకుడు వైష్ణవ్ తేజ్. ఆయన దాని తర్వాత ‘కొండపొలం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నా.. ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ సినిమాలతో వరుసగా నిరుత్సాహపరిచారు. దీంతో ప్రస్తుతం తను కూడా తదుపరి చిత్ర విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంత వరకు వైష్ణవ్ నుంచి మరో కొత్త కబురు వినపడలేదు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలతో వరుస విజయాలందుకొని జోరు మీదున్నారు నవీన్ పొలిశెట్టి. ఆయన ‘అనగనగా రాజు’ అనే ఓ సినిమా చేస్తున్నట్లు గతంలో ఓ ప్రకటన వెలువడింది. కానీ, ఆ తర్వాత దానికి సంబంధించి మరే విశేషాలు బయటకు రాలేదు. ప్రస్తుతానికైతే తన సినిమాలన్నీ స్క్రిప్ట్ దశలోనే ఉన్నాయని.. మంచి నాణ్యమైన కొత్తదనం నిండిన చిత్రాలను అందించడానికి సమయం పడుతుందని.. అంత వరకు ఓపికగా ఎదురు చూడాలని నవీన్ తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ నెటిజన్కు బదులిచ్చారు. సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అతిథి పాత్రలో..
ఓవైపు కథానాయకుడిగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు మంచి పాత్రలు దొరికినప్పుడల్లా ఇతర హీరోల చిత్రాల్లోనూ సందడి చేస్తుంటారు రానా. ఆయన నుంచి గతేడాది ఒక్క చిత్రం బయటకు రాలేదు. తేజ దర్శకత్వంలో ‘రాక్షస రాజు’ అనే చిత్రం చేయనున్నట్లు ఆమధ్య ప్రకటన వచ్చినా.. అదింత వరకు పట్టాలెక్కలేదు. ఇక రానా కలల ప్రాజెక్ట్ ‘హిరణ్య కశ్యప’పై గతేడాది కామికాన్ వేడుకలో ప్రకటన వచ్చినా.. అదీ కార్యరూపం దాల్చలేదు. ఆయన ప్రస్తుతానికైతే రజనీకాంత్ ‘వేట్టయాన్’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది. -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
Gurucharan Singh: బాలీవుడ్లో ప్రముఖ టీవీ నటుడు ఐదు రోజులుగా కన్పించకుండా పోవడం చర్చనీయాంశమైంది. అతడిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM