Anjali: ‘గీతాంజలి’ డబుల్ బొనాంజా

‘‘నేను చేసిన తొలి నాయికా ప్రధానమైన చిత్రం ‘గీతాంజలి’. పదేళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా, నా యాభయ్యో సినిమాగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశాం. ఇది నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం’’ అన్నారు కథానాయిక అంజలి. ఆమె ప్రధాన పాత్రధారిగా... శివ తుర్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ఎం.వి.వి.సినిమాస్తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ పతాకంపై కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో టీజర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీవిష్ణు, బుచ్చిబాబు సానా, బాబీ, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అంజలి మాట్లాడుతూ ‘‘రచయిత కోన వెంకట్ ‘నిశ్శబ్దం’ సమయంలో ఈ కథాలోచన గురించి చెప్పారు. ఆయన స్క్రిప్ట్ కోసం ఇంత సమయం తీసుకుని సిద్ధం చేశారు. డబుల్ బొనాంజాలా తొలి సినిమాని మించి నవ్విస్తుంది, భయపెడుతుందీ చిత్రం. థియేటర్ల నుంచి ఒక మంచి అనుభూతితో ప్రేక్షకులు బయటికెళతారు’’ అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ ‘ఇందులోని ప్రతి పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. ప్రవీణ్, శివ, శ్రీజో అందరికీ ఈ చిత్రం మంచి ఫలితాన్నిస్తుంది’’ అన్నారు. శివ తుర్లపాటి మాట్లాడుతూ ‘కోన వెంకట్ వల్లే మళ్లీ పరిశ్రమలోకి వచ్చా. ఆయన చేసిన ప్రతి సినిమాకీ నృత్య దర్శకత్వం చేశా. దర్శకత్వం కోసం కథ సిద్ధం చేసుకున్నా. కానీ ముందు ఈ సినిమాని తీయమని కోన చెప్పారు.ఇంతమంది నటులతో కలిసి సినిమా చేయడం చాలా తృప్తినిచ్చింది’’ అన్నారు.
‘‘అంజలి యాభై సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలతో విజయవంతంగా కెరీర్ని కొనసాగిస్తున్నందుకు గర్వంగా ఉంది. గతేడాదిగా కోన వెంకట్తో పనిచేస్తున్నా. త్వరలోనే ఆయనతో ఓ సినిమాని చేస్తున్నా. శ్రీనివాస్రెడ్డి, సత్యం రాజేశ్... ఇలా అందరూ నాకు కావల్సినవాళ్లే ఇందులో నటించారు. దీంతో రచయితలు మరో స్థాయికి చేరుకుంటున్నారు. అందరినీ నవ్వించి, భయపెట్టి వసూళ్లు కొల్లగొట్టాలని కోరుకుంటున్నా’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ కార్యక్రమంలో అలీ, అవినాష్ తదితర చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. - 
                                    
                                        

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్- 2025లో ‘మంజుమ్మల్ బాయ్స్ ’ అదరగొట్టింది. - 
                                    
                                        

‘నీకేమైనా పిచ్చా.. మొత్తం పాట బైక్ మీద తీస్తే బోర్.. ‘గులాబీ’ మూవీకి 30ఏళ్లు
‘గులాబీ’ (Gulabi) 90వ దశకంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీస్లో ఇదీ ఒకటి. అప్పట్లో యువ ప్రేమికులను ఓ ఊపు ఊపేసిన సినిమా. ఈ సినిమా విడుదలై నవంబరు 3వ తేదీకి 30ఏళ్లు పూర్తి చేసుకుంది. - 
                                    
                                        

పబ్లిక్లో వాళ్ల పేరు చెబితే నన్ను చంపేస్తారు: రష్మిక
రష్మిక ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’ (The Girlfriend). రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహిస్తున్నారు. - 
                                    
                                        

ఆస్కార్ అవార్డుల్లోనూ లాబీయింగ్: పరేశ్ రావల్
ఆస్కార్ అవార్డుల్లోనూ లాబీయింగ్ జరిగే ఆస్కారం ఉందని నటుడు పరేశ్ రావల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. - 
                                    
                                        

‘శివ’లో ఆ పాత్ర కోసం మోహన్బాబు.. వద్దంటే వద్దన్న వర్మ!
నాగార్జున కథానాయకుడిగా వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ ఓ పాత్ర కోసం మోహన్బాబును అనుకున్నారట. - 
                                    
                                        

చేవెళ్ల బస్సు ప్రమాదం.. సినిమా అప్డేట్స్ వాయిదా వేసిన నిర్మాణ సంస్థలు
చేవెళ్ల బస్సు ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోందని సినీ నిర్మాణ సంస్థలు విచారం వ్యక్తం చేశాయి. - 
                                    
                                        

హీరో ఛాన్సా..?పెళ్లా..?: దేవిశ్రీ ప్రసాద్ ఏం చెప్పారంటే!
ఫస్ట్ హీరో అవుతారా..? పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్నకు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఏం సమాధానం చెప్పారంటే! - 
                                    
                                        

నవంబరు ఫస్ట్ వీక్ మూవీస్.. థియేటర్/ఓటీటీ వినోదాలివే..!
ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు, వెబ్సిరీస్లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఎప్పుడు ఏ సినిమా వస్తుందో తెలుసా? - 
                                    
                                        

భారతీయులంతా మీకు వందనం చేస్తున్నారు : టీమ్ఇండియాపై సినీ సెలబ్రిటీల ప్రశంసలు
భారత జట్టు కప్పు అందుకోవడంతో సినీ సెలబ్రిటీలు ఈ టీమ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. - 
                                    
                                        

క్లైమాక్స్ పోరులో ‘శంకర వరప్రసాద్’
సంక్రాంతి బరిలో ‘మన శంకరవరప్రసాద్గారు’గా సందడి చేయనున్నారు కథానాయకుడు చిరంజీవి. ఆయన టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక. - 
                                    
                                        

అప్డేట్స్ 2030లో ఇద్దామా!
దర్శకుడు రాజమౌళి చిత్రాలే కాదు.. వాటిని తనదైన శైలిలో సినీప్రియుల్లోకి తీసుకెళ్లే తీరు వినూత్నంగానే ఉంటుంది. అందుకే ఆయన సినిమాల నుంచి ఓ అప్డేట్ బయటకొస్తుందన్నా.. దాన్ని ఏ రీతిలో సరికొత్తగా జనాల్లోకి తీసుకెళ్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. - 
                                    
                                        

ప్రపంచం నాకిచ్చిన పేరు ‘కింగ్’
‘‘నేను ఎంత మందిని చంపానో నాకు గుర్తు లేదు. వారు మంచివారా చెడ్డవాళ్లా అనేది కూడా అడగలేదు. కానీ నాకు గుర్తున్నదల్లా వారి కళ్లలో భయం చూడటం మాత్రమే. దానికి నేనే కారణం’’ అంటున్నారు బాలీవుడ్ అగ్రహీరో షారుక్ ఖాన్. - 
                                    
                                        

ఆ వార్తలన్నీ అసత్యం.. నిరాధారం: ప్రశాంత్ వర్మ
తనకు.. నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రై.లి మధ్య ఉన్న వివాద విషయంలో పలు ఛానళ్లు, సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవి, అసత్యమైనవని దర్శకుడు ప్రశాంత్ వర్మ అన్నారు. - 
                                    
                                        

మహేశ్ని ఏనాడూ సాయం అడగలేదు: సుధీర్బాబు
‘‘మహేశ్బాబు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా.. నాకో పాత్ర గానీ, సినిమా గానీ రికమెండ్ చేయమని తనని ఏరోజూ అడగలేద’’న్నారు కథానాయకుడు సుధీర్బాబు. కృష్ణ అల్లుడు, మహేశ్ బావగానే సినీ ప్రయత్నాలు మొదలు పెట్టినప్పటికీ.. అందరిలాగే తానూ ఆడిషన్స్ ఇచ్చానని చెప్పారు. - 
                                    
                                        

‘కమల్ ఔర్ మీనా’కు కియారా సై?
‘బైజుబావ్రా’, ‘పాకీజా’ లాంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలతో చిత్రపరిశ్రమలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు అలనాటి అందాల తార మీనా కుమారి. ‘కమల్ ఔర్ మీనా’ పేరుతో ఆమె జీవిత కథ తెరపైకి రాబోతున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ పి.మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. - 
                                    
                                        

ఇప్పుడు మనం చరిత్ర సృష్టిస్తాం!
కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యానికి మద్ధతుగా వాయుసేన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ను చేపట్టింది. ఈ నేపథ్యంతోనే దర్శకుడు ఓని సేన్ ఆ యుద్ధంలో వైమానిక దళం పోషించిన కీలక పాత్రను ప్రధానాంశంగా అదే పేరుతో సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ ప్రధాన పాత్రధారులుగా వికాశ్ దర్శకత్వంలో ఓ చిత్రం శ్రీకారం చుట్టుకుంది. సృజన గోపాల్ నిర్మాత. జీవన్ కుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. - 
                                    
                                        

‘బిగ్బాస్-9’ నుంచి మాధురి ఎలిమినేట్.. అతడికి హౌస్లో ఉండే అర్హత లేదంటూ కామెంట్
బిగ్బాస్ సీజన్:9 నుంచి ఈ వారం దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అడుగు పెట్టిన ఆమె తనదైన మాటతీరు, ఆటతో ప్రేక్షకులను అలరించారు. - 
                                    
                                        

ప్రతిభావంతులకు ఇళయరాజా ఆహ్వానం
తన కుమార్తె భవతారణి పేరిట బాలికల ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గతంలో వెల్లడించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

‘ఎస్ఐఆర్’కు ఈసీ రెడీ.. 12 రాష్ట్రాలు/యూటీల్లో అమలు
 - 
                        
                            

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 


