Anjali: ‘గీతాంజలి’ డబుల్ బొనాంజా
‘నేను చేసిన తొలి నాయికా ప్రధానమైన చిత్రం ‘గీతాంజలి’. పదేళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా, నా యాభయ్యో సినిమాగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశాం. ఇది నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం’’ అన్నారు కథానాయిక అంజలి.
‘‘నేను చేసిన తొలి నాయికా ప్రధానమైన చిత్రం ‘గీతాంజలి’. పదేళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా, నా యాభయ్యో సినిమాగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశాం. ఇది నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం’’ అన్నారు కథానాయిక అంజలి. ఆమె ప్రధాన పాత్రధారిగా... శివ తుర్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ఎం.వి.వి.సినిమాస్తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ పతాకంపై కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో టీజర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీవిష్ణు, బుచ్చిబాబు సానా, బాబీ, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అంజలి మాట్లాడుతూ ‘‘రచయిత కోన వెంకట్ ‘నిశ్శబ్దం’ సమయంలో ఈ కథాలోచన గురించి చెప్పారు. ఆయన స్క్రిప్ట్ కోసం ఇంత సమయం తీసుకుని సిద్ధం చేశారు. డబుల్ బొనాంజాలా తొలి సినిమాని మించి నవ్విస్తుంది, భయపెడుతుందీ చిత్రం. థియేటర్ల నుంచి ఒక మంచి అనుభూతితో ప్రేక్షకులు బయటికెళతారు’’ అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ ‘ఇందులోని ప్రతి పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. ప్రవీణ్, శివ, శ్రీజో అందరికీ ఈ చిత్రం మంచి ఫలితాన్నిస్తుంది’’ అన్నారు. శివ తుర్లపాటి మాట్లాడుతూ ‘కోన వెంకట్ వల్లే మళ్లీ పరిశ్రమలోకి వచ్చా. ఆయన చేసిన ప్రతి సినిమాకీ నృత్య దర్శకత్వం చేశా. దర్శకత్వం కోసం కథ సిద్ధం చేసుకున్నా. కానీ ముందు ఈ సినిమాని తీయమని కోన చెప్పారు.ఇంతమంది నటులతో కలిసి సినిమా చేయడం చాలా తృప్తినిచ్చింది’’ అన్నారు.
‘‘అంజలి యాభై సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలతో విజయవంతంగా కెరీర్ని కొనసాగిస్తున్నందుకు గర్వంగా ఉంది. గతేడాదిగా కోన వెంకట్తో పనిచేస్తున్నా. త్వరలోనే ఆయనతో ఓ సినిమాని చేస్తున్నా. శ్రీనివాస్రెడ్డి, సత్యం రాజేశ్... ఇలా అందరూ నాకు కావల్సినవాళ్లే ఇందులో నటించారు. దీంతో రచయితలు మరో స్థాయికి చేరుకుంటున్నారు. అందరినీ నవ్వించి, భయపెట్టి వసూళ్లు కొల్లగొట్టాలని కోరుకుంటున్నా’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ కార్యక్రమంలో అలీ, అవినాష్ తదితర చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.