‘ఈటీవీ విన్’తో కలిసి పనిచేయడం కోసం ఎదురు చూస్తున్నా
ఓటీటీ విప్లవం వచ్చినప్పటి నుంచి ఈనాడు గ్రూప్ నుంచి ఓటీటీ వేదిక ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశా. ఆలస్యమైనా మంచి వేదికని తీసుకొచ్చారు.
దర్శకుడు హరీశ్ శంకర్
‘‘ఓటీటీ విప్లవం వచ్చినప్పటి నుంచి ఈనాడు గ్రూప్ నుంచి ఓటీటీ వేదిక ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశా. ఆలస్యమైనా మంచి వేదికని తీసుకొచ్చారు. ఈటీవీ విన్తో కలిసి పనిచేయడం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ఆ వేదికలో వస్తున్న ‘వళరి’ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతుంద’’న్నారు ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్. ఆయన ముఖ్య అతిథిగా గురువారం హైదరాబాద్లో ‘వళరి’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శ్రీరామ్, రితికాసింగ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. ఎం.మృతిక సంతోషిణి దర్శకత్వం వహించారు. కె.సత్యసాయిబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాత. మార్చి 6న ఈటీవీ విన్ ఓటీటీ వేదికలో ప్రదర్శితం కానుంది. ట్రైలర్ విడుదల అనంతరం హరీశ్ శంకర్ మాట్లాడుతూ ‘‘చిత్ర పరిశ్రమ మహిళా దర్శకులు తక్కువ మంది ఉంటారు. దర్శకురాలు సంతోషిణి ఎంతో సృజనాత్మకతతో చిత్రాన్ని తీర్చిదిద్దారు. ట్రైలర్, సినిమా పేరు ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఎడిటర్ తమ్మిరాజు సహా ఎంతోమంది ప్రతిభావంతులు ఈ సినిమాకి పనిచేశారు. వాణిజ్య ప్రధానమైన సినిమాలు తీస్తున్నప్పుడు మాకు ఎన్నో పరిధులు ఉంటాయి. ఎన్నో కథలు చెప్పాలనుకుంటాం కానీ కుదరదు. నేను చలం ‘మైదానం’ తెరకెక్కిద్దామనే పరిశ్రమకి వచ్చా. కానీ ‘మిరపకాయ్’, ‘డీజే’, ‘గబ్బర్సింగ్’ తదితర చిత్రాలు తీశా. ఇంకాస్త కథా ప్రాధాన్యమున్న సినిమాలు తీయాలనుకున్నప్పుడు ఓటీటీ వేదికలు పనికొస్తాయి. ఈ వేదికలతో మాకు భాష పరంగా చాలా సమస్యలొస్తున్నాయి. ఈ దశలో తెలుగు నుంచి ఎంతో అనుభవం ఉన్న ఈనాడు, ఈటీవీ సంస్థల నుంచి ఓటీటీ రావడం చాలా ఆనందంగా ఉంది. కథానాయకుడు శ్రీరామ్కి కథ చెప్పడానికి నేను సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు చాలా ప్రయత్నించా. కానీ కుదరలేదు. శ్రీరామ్, రితికా కలిసి చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందాలని కోరుకుంటున్నా’’ అన్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘ఎంతో స్పష్టతతో ఈ సినిమాని తెరకెక్కించారు సంతోషిణి. కథ, కథనం ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని పంచుతాయి’’ అన్నారు. రితికాసింగ్ మాట్లాడుతూ ‘‘చాలా రోజుల తర్వాత నేను చేసిన తెలుగుసినిమా ఇది. నా పాత్రలో ఎన్నో పార్శ్వాలున్నాయి. శ్రీరామ్, సుబ్బరాజు, ఉత్తేజ్ తదితరులతో కలిసి పనిచేయడం మంచి అనుభవం’’ అన్నారు. దర్శకురాలు మాట్లాడుతూ ‘‘వళరి అనేది ఒక ఆయుధం. మనం ఏం చేసినా కర్మ తిరిగి మన వద్దకే వస్తుందనే అంశం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. వళరి ఆయుధం కూడా అలాగే ఉంటుంది. అందుకే ఆ పేరు పెట్టాం. ఎంతో స్వేచ్ఛతో చిత్రాన్ని తీర్చిదిద్దా. నటీనటులు, సాంకేతిక బృందం చక్కటి సహకారం అందించార’’న్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తేజ్, సుబ్బరాజు, తమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?