రామోజీ ఫిల్మ్ సిటీలో ‘భీమునిపట్నం’
కంచర్ల ఉపేంద్ర, అపర్ణా దేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘1920 భీమునిపట్నం’. నరసింహ నంది తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వ పోలీసు అధికారి పాత్రలో ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్య్ర సమరయోధుడి కుమార్తె పాత్రలో అపర్ణ కనిపించనుంది.
కంచర్ల ఉపేంద్ర, అపర్ణా దేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘1920 భీమునిపట్నం’. నరసింహ నంది తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వ పోలీసు అధికారి పాత్రలో ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్య్ర సమరయోధుడి కుమార్తె పాత్రలో అపర్ణ కనిపించనుంది. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి కంచర్ల అచ్యుతరావు క్లాప్నిచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...‘సీతారాం, సుజాత మధ్య నడిచే ప్రేమకథను దర్శకుడు అద్భుతంగా తయారు చేశారు. 1920 నేపథ్యం కావడంతో ఆనాటి అంశాలను ప్రతిబింబించాల్సిన ఆవశ్యకత ఉండటంతో సంగీతానికి ఇళయరాజాను సంప్రదించామ’ని అన్నారు. ‘భారత స్వతంత్ర పోరాట నేపథ్యంలో చక్కటి భావోద్వేగాల మేళవింపుతో సినిమాని తెరకెక్కిస్తున్నాం నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించనున్నామ’ని అన్నారు దర్శకుడు.
‘జిగేల్’ పాట
త్రిగుణ్, మేఘ చౌదరి ప్రధాన పాత్రలుగా మల్లి ఏలూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జిగేల్’. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాని శ్రీ ఇందిరా కంబైన్స్, యాపిల్ క్రియేషన్స్ పతాకాలపై డీవై జగన్మోహన్, అల్లం నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నాయకానాయికలు, ఇతర తారాగణంపై పాటని తెరకెక్కిస్తున్నారు. దీంతో చిత్రీకరణ పూర్తవుతుందని నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇతర కార్యక్రమాలను త్వరలో పూర్తి చేసుకొని ఏప్రిల్లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోందని దర్శకుడు మల్లి తెలిపారు. ఈ చిత్రానికి మంత్ర ఆనంద్ సంగీతం అందిస్తున్నారు.
అనుభవాన్ని రంగరించి... ‘రికార్డ్బ్రేక్’
నిర్మాతగానే కాదు... అప్పుడప్పుడూ మెగాఫోన్ చేతపట్టి దర్శకత్వం కూడా చేస్తుంటారు చదలవాడ శ్రీనివాసరావు. చిత్ర పరిశ్రమలో సుదీర్ఘమైన అనుభవం సంపాదించిన ఆయనకి కథల ఎంపికలో మంచి అభిరుచి ఉంది. సామాజిక బాధ్యతని గుర్తు చేస్తూ, నిజ జీవితాలకి దగ్గరగా ఉంటాయి ఆయన సినిమాలు. మరోసారి ఆయన సమాజానికి ఉపయోగపడే కథాంశాన్ని ఎంచుకుని ‘రికార్డ్బ్రేక్’ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాని ఎనిమిది భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్యకృష్ణ, సంజన, టి.ప్రసన్నకుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెట్లో నటీనటులకి సన్నివేశం వివరింస్తున్న దృశ్యమే ఇది. అనుభవాన్నంతా రంగరించి, తనదైన విజన్తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్టు ఈ చిత్రం స్పష్టం చేస్తోంది.
రక్తంతో రంగులద్దుతా!
జీవితానికి దగ్గరగా అనిపించే పాటలెన్నో. మరి ఆ పాటలను వినిపించే సంగీతకారులకు ఓ అద్భుతమైన, బాధకరమైన జీవితం ఉంటుంది. అలాంటి ఓ కథనే ‘చమ్కీలా’తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ. ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చమ్కీలా జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రమది. దిల్జీత్ దోసాంజ్, పరిణీతి చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘ఇష్క్ మిటాయే...’ అంటూ సాగే తొలి పాటను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. ‘నా ముందున్న అందమైన ప్రపంచం రంగు వెలిసిపోయింది. నా రక్తంతో దానికి తిరిగి రంగులద్దుతాను...’ అనే వ్యాఖ్యల్ని జోడించింది. మోహిత్ చౌహాన్ ఆలపించిన ఈ పాటకి ఇర్షద్ కమిల్ సాహిత్యం అందించారు. ఏఆర్ రెహమాన్ బాణీలు సమకూర్చారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల