గెలుపుతో ప్రతీకారం తీరాలి
భారత ఫుట్బాల్ జట్టు సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేయడానికి ‘మైదాన్’తో సిద్ధమవుతున్నాడు అజయ్ దేవగణ్. ఆనాటి జట్టు దిగ్గజ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీంగా ఆయన నటిస్తున్న చిత్రమే ‘మైదాన్’.
భారత ఫుట్బాల్ జట్టు సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేయడానికి ‘మైదాన్’తో సిద్ధమవుతున్నాడు అజయ్ దేవగణ్. ఆనాటి జట్టు దిగ్గజ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీంగా ఆయన నటిస్తున్న చిత్రమే ‘మైదాన్’. ఆయనకు జోడీగా ప్రియమణి కనిపిచనుండగా.. అమిత్ రవీంద్రనాథ్ శర్మ తెరకెక్కిస్తున్నారు. అజయ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ట్రైలర్ను విడుదల చేశారు. ‘భారత ఫుట్బాల్ జట్టు పతకం గెలుస్తుందని భారత్లోనే ఎవరికీ నమ్మకం లేదు. కానీ మీరెలా నమ్ముతున్నారు..?’ అనే ప్రియమణి సంభాషణతో ట్రైలర్ మొదలవుతుంది. అజయ్ దేశమంతా తిరుగుతూ ఒక్కో ఆటగాణ్ని ఎంపిక చేయడం.. తన సర్వశక్తులూ ధారపోసి మేటి జట్టుగా తీర్చిదిద్దడం.. ఆఖరికి ఆ జట్టు.. అప్రతిహత విజయాలతో ఏషియన్ గేమ్స్లో పతకాలు గెలవడం, 1956 ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలవడం.. వరుసగా చూపించారు. ‘నేను దేశం గురించి మాట్లాడటానికి ఇక్కడికొచ్చాను. కానీ మనం ఇక్కడ బెంగాల్, హైదరాబాద్ గురించే మాట్లాడుకోవాల్సి రావడం దురదృష్టకరం’, ‘ఈ జనం నుంచి మీకు ప్రోత్సాహం దక్కుతుందని నమ్మకం పెట్టుకోవద్దు. చెవులు మూసుకొని మీ ఆట మీరు ఆడండి’, ‘నాకు మాటలొద్దు.. గెలుపుతో ప్రతీకారం కావాలి’ లాంటి డైలాగులు చిత్రంలోని భావోద్వేగాల గాఢతని తెలియజేస్తున్నాయి. జీ స్టూడియోస్, బోనీ కపూర్, అరుణవ జాయ్ సేన్గుప్తా, ఆకాశ్ చావ్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్నారు.
‘బేబీ జాన్’ చాలా కష్టమైన చిత్రీకరణ
బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్ యాక్షన్ సినిమాల పట్ల తనకున్న ప్రేమను ఎప్పుడూ వ్యక్తపరుస్తుంటాడు. పూర్తి స్థాయి యాక్షన్ చిత్రాల్లో నటించాలన్న తన కల ‘బేబీ జాన్’తో నెరవేరింది. కాలీస్ తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు అట్లీ, మురాద్ ఖేతాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో హిందీలో అడుగుపెట్టనుంది కీర్తి సురేశ్. కీలక పాత్రలో వామికా గబ్బి కనిపించనుంది. తాజాగా వరుణ్ సామాజిక మాధ్యమాల వేదికగా తన ఫొటోని పంచుకున్నాడు. సినిమా పేరున్న దుస్తులతో, నెత్తురోడుతున్న నుదుటితో ఉన్న ఫొటో ఆసక్తిగా కనిపిస్తోంది. ‘‘బేబీ జాన్’ చిత్రీకరణ 70వ రోజు. సూర్యుడు ఉదయించే వరకూ అవిశ్రాంతంగా షూటింగ్లో పాల్గొంటూనే ఉన్నాం. నేను చేసిన కష్టతరమైన చిత్రీకరణలలో ఇది ఒకటి’ అంటూ వ్యాఖ్యల్ని జోడించాడు.
యుద్ధం ముగిసింది
గతేడాది ‘2018’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు మలయాళ కథానాయకుడు టోవినో థామస్. భిన్నమైన కథనాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన ప్రస్తుతం ‘ఐడెంటిటీ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. టోవినో ప్రధాన పాత్రలో అనాస్ ఖాన్, అఖిల్ పాల్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. త్రిష కథానాయిక. తాజాగా ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తైనట్లు టోవినో సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ ఫొటోని పంచుకున్నారు. ‘యుద్ధం ముగిసింది. యానిక్ బెన్ పర్యవేక్షణలో కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను ముగించాము. ఆకట్టుకునే యాక్షన్ రైడ్ మీ ముందుకు రాబోతుంది’ అంటూ వ్యాఖ్యల్ని జోడించారు. మందిరా బేడీ, వినాయ్ రాయ్లు కీలక పాత్రల్లో నటించనున్నారు.
ప్రేమా.. నీవెక్కడ?
తొమ్మిదేళ్ల తర్వాత ప్రముఖ గాయకుడు లక్కీ అలీ తన గళాన్ని బాలీవుడ్లో వినిపించారు. ప్రతీక్గాంధీ, విద్యాబాలన్ జంటగా తెరకెక్కుతున్న ‘దో ఔర్ దో ప్యార్’లో ఆయన పాడిన ‘తూ హై కహా..’ అంటూ హృద్యంగా సాగే ఈ గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. ది లోకల్ ట్రైన్ ఈ పాటని రచించి, స్వరాలు సమకూర్చారు. నాయికానాయకులైన జంట పాతరోజుల్లోని తమ మధ్య జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా ఈ మెలోడీ గీతం సాగుతుంది. ఈ చిత్రానికి శిరీష గుహ ఠాకూర్తా దర్శకురాలు. ఇలియానా, సెంథిల్ రామమూర్తి ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి