Cinema News: కొత్త పాత్రలు పిలుస్తున్నాయ్
కొత్త ప్రయాణం మొదలు పెట్టేందుకు పలువురు కథానాయకులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పట్నుంచో చేస్తున్న సినిమాల్ని దాదాపు ముగింపు దశకు చేర్చేశారు.
కొత్త ప్రయాణం మొదలు పెట్టేందుకు పలువురు కథానాయకులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పట్నుంచో చేస్తున్న సినిమాల్ని దాదాపు ముగింపు దశకు చేర్చేశారు. వీళ్లంతా ఇకనుంచి పూర్తయిన ఆయా సినిమాల ప్రచార హంగామాతోనూ... మరోవైపు కొత్త సినిమాల ప్రయాణంతోనూ బిజీగా గడపనున్నారు.
పాన్ ఇండియా సినిమా ట్రెండ్ మొదలయ్యాక ఒకొక్క సినిమా కోసం కథానాయకులు సుదీర్ఘంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇదివరకు ఏడాదికి ఒకట్రెండు సినిమాలతో సందడి చేసిన కథానాయకులు... ఇప్పుడు ఒక్కో సినిమా కోసం రెండు మూడేళ్లు కేటాయించాల్సి వస్తోంది. విడుదల తేదీలు పదే పదే మారిపోతుంటాయి. చిత్రీకరణల్లోనూ, నిర్మాణానంతర పనుల్లోనూ జరుగుతున్న జాప్యమే అందుకు కారణం. అభిమానులేమో తమ కథానాయకుడి సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా కథానాయకుల్ని, దర్శకనిర్మాతల్ని తొందర పెడుతుంటారు. అయితే ఈమధ్య చిత్రసీమలో పరిణామాల్ని గమనిస్తే... పాన్ ఇండియా సినిమాల్లోనూ వేగం కనిపిస్తోంది. వడి వడిగా ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి’, రామ్చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ఎన్టీఆర్ ‘దేవర’, అల్లు అర్జున్ ‘పుష్ప 2’, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’... ఇలా చాలా సినిమాల ప్రయాణం చివరి దశకు చేరుకుంది. ఇవి ఎప్పట్నుంచో చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ పూర్తయితే, ఈ కథానాయకులంతా కూడా మరో దఫా కొత్త సినిమాలకి సంబంధించిన కొత్త కబుర్లతో అభిమానుల్లో జోష్ పెంచనున్నారు.
కథానాయకులు ఏకకాలంలో రెండు మూడు సినిమాలకి పచ్చజెండా ఊపుతున్నారు. ఒక సినిమా పూర్తవ్వగానే మరో సినిమా కోసం రంగంలోకి దిగుతున్నారు. ప్రభాస్, పవన్కల్యాణ్ తదితర కథానాయకులైతే ఏకకాలంలో రెండు మూడు సినిమాల్ని సెట్స్పైకి తీసుకెళుతున్నారు. ‘కల్కి 2898 ఎ.డి’ని దాదాపుగా పూర్తి చేసిన ప్రభాస్, త్వరలోనే ‘ది రాజాసాబ్’, ‘సలార్ 2’ సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. పవన్కల్యాణ్ ‘ఓజీ’ సెప్టెంబరు 27న విడుదల ఖాయమని ఇటీవలే నిర్మాత ప్రకటించారు. మరోవైపు పవన్కల్యాణ్ చేతిలో ‘ఉస్తాద్ భగత్సింగ్’ చిత్రం ఉంది. చాలా రోజులుగా ఒకే సినిమాతో సెట్స్పై ఉన్న రామ్చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ల కోసం కొత్త కథలు, పాత్రలు ఎదురు చూస్తున్నాయి. రామ్చరణ్ ‘గేమ్ఛేంజర్’ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే నెల నుంచే ఆ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే లక్ష్యంతో సినిమాని పట్టాలెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ‘దేవర’ ఈ నెలలోనే టాకీ భాగం చిత్రీకరణని పూర్తి చేసుకోనుంది. మరోవైపు ఆయన ఈ నెల నుంచే బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’ కోసం రంగంలోకి దిగుతున్నారు.
అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రీకరణని మే నెలాఖరులోపు పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 15 అంటూ మరోసారి విడుదల తేదీని ఖరారు చేస్తూ పోస్టర్ని విడుదల చేసింది. ‘పుష్ప2’ ముగింపు దశకు చేరుకోవడంతో, ఆయన తదుపరి చేయనున్న సినిమా గురించి చర్చ ఊపందుకుంది. బన్నీ తదుపరి చిత్రం దాదాపు అట్లీ దర్శకత్వంలోనే రూపొందనుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా కూడా చేయనున్నారు. మరో అగ్ర కథానాయకుడు మహేశ్బాబు ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమా కోసం రంగంలోకి దిగారు. ఈ నెలలోనే ఆ సినిమాకి సంబంధించిన కొత్త సంగతులు వినిపించే అవకాశాలున్నాయి. ఇందులో ఓ కొత్త లుక్లో మహేశ్ కనిపించనున్నారని, అందుకోసం సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
వేసవి తర్వాత చిత్రసీమలో కోలాహలం
రామ్, నాగచైతన్య తదితర యువ కథానాయకులు కూడా సెట్స్పై ఉన్న సినిమాల్ని పూర్తి చేసి కొత్త సినిమాలతో రంగంలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రీకరణ సింహభాగం పూర్తి చేసుకుంది. ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో తదుపరి సినిమాని చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ దాదాపు పూర్తయింది. కొంత టాకీ, కొన్ని పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ కూడా ఆగస్టు 29న విడుదల ఖరారైంది. ఇప్పటికే ఆయన ‘దసరా’ కలయికలో సినిమాని ప్రకటించారు. ‘ఫ్యామిలీస్టార్’తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ... వెంటనే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు. స్పై థ్రిల్లర్ కథతో భారీ హంగులతో రూపొందనున్న సినిమా ఇది. ఈ వేసవి తర్వాత పలువురు అగ్ర తారల సినిమాల విడుదలతోపాటు, వాళ్ల కొత్త సినిమాల చిత్రీకరణలతో చిత్రసీమలో కోలాహలం కనిపించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. -
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
చిట్టిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసుకుంది నటి ఫరియా అబ్దుల్లా. అమాయకమైన చూపులతోనూ నటనతోనూ ఆకట్టుకుంటున్న ఈ హైదరాబాదీ అమ్మాయి ‘ఆ ఒక్కటీ అడక్కు’లోని సిద్ధి పాత్రతో నవ్వులు పంచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్