కలిశారు తొలిసారి
విజయవంతమైన కలయికలకు చిత్రసీమలో ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. బాక్సాఫీస్ లెక్కల్ని బలంగా ప్రభావితం చేసే ఈ కలయికలపై ఇటు సినీప్రియులూ, అటు వ్యాపార వర్గాలు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు.
అయినా.. అంచనాలు పైౖపైకి
విజయవంతమైన కలయికలకు చిత్రసీమలో ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. బాక్సాఫీస్ లెక్కల్ని బలంగా ప్రభావితం చేసే ఈ కలయికలపై ఇటు సినీప్రియులూ, అటు వ్యాపార వర్గాలు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రస్తుతం తెలుగులో సెట్స్పై ముస్తాబవుతున్న పలు క్రేజీ ప్రాజెక్ట్ల్లో ఈ తరహా కలయికలే ఎక్కువ ఉన్నాయి. అయితే వీటికి దీటుగా అదే స్థాయిలో ఆకర్షిస్తూ.. అంచనాలు పెంచేస్తున్న తొలి కలయికలూ అనేకం తెలుగు చిత్రసీమలో కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని కాంబినేషన్లు ఇప్పటికే పట్టాలెక్కగా.. మరికొన్ని సెట్స్పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. మరి తొలిసారి జట్టు కట్టి ఆకర్షిస్తున్న ఆ కలయికలేవి? ఆ చిత్ర సంగతులేంటి? చూసేద్దాం పదండి..
ఒకప్పుడు కొత్త కలయిక విషయంలో అగ్రతారలు ఆచితూచి వ్యవహరించేవారు. ముఖ్యంగా తమ స్టార్డమ్, ఇమేజ్ను సమంగా బ్యాలెన్స్ చేస్తూ అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా సినిమాలు చేసే సీనియర్ దర్శకుల వైపే మొగ్గు చూపేవారు. కానీ, ఇప్పుడా లెక్కలన్నీ మారిపోయాయి. ఇమేజ్ సంకెళ్లను తెంచుకొని అనుభవాల లెక్కలు పక్కకు నెట్టి కొత్తతరం దర్శకులతో ప్రయాణం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా తెరపై మునుపెన్నడూ చూడని విభిన్నమైన కలయికలకు అవకాశం దొరుకుతోంది.
చిరంజీవి చిత్రసీమలోకి పునరాగమనం చేసినప్పటి నుంచి తన కెరీర్ను వైవిధ్యభరితంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువగా యువ దర్శకులతో కలిసి పని చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి ఫలితంగానే ‘సైరా నరసింహరెడ్డి’, ‘గాడ్ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ విజయాలు దక్కాయి. ఇప్పుడీ క్రమంలోనే మరో యువ దర్శకుడు వశిష్ఠతో ‘విశ్వంభర’ను పట్టాలెక్కించారు చిరు. ‘బింబిసార’ విజయం తర్వాత వశిష్ఠ రూపొందిస్తున్న మరో సోషియో ఫాంటసీ సినిమా కావడం.. ‘అంజి’ తర్వాత చిరు మళ్లీ ఈ తరహా కథలో నటిస్తుండటంతో దీనిపై అంచనాల్ని రెట్టింపు చేస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత చిరు నటించే చిత్రమేదన్నది ఇంకా ఖరారు కాకున్నా.. దాదాపు అరడజను మందికి పైగా దర్శకులు కథలతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో హరీశ్ శంకర్, మారుతి, కల్యాణ్ కృష్ణ, అనుదీప్, త్రినాథరావు నక్కిన తదితరుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
నాగ్ కోసం మరో ఇద్దరు..
కొత్తదనాన్ని అందిపుచ్చుకోవడంలో.. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు నాగార్జున. ఇప్పుడాయన తొలిసారి శేఖర్ కమ్ములతో జట్టు కట్టి ‘కుబేర’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన చేయనున్న సినిమా కూడా కొత్త కలయికలోనే రూపొందనుంది. ఈ చిత్రంతో తమిళ యువ దర్శకుడు నవీన్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ సినిమాని కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. ఇక నాగ్ దీంతో పాటే సుబ్బు అనే మరో కొత్త దర్శకుడి కథకు పచ్చజెండా ఊపినట్లు ప్రచారం వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే తన నుంచి మరో కొత్త కలయికను చూసే అవకాశం దొరుకుతుంది.
ప్రభాస్.. పీరియాడిక్ యాక్షన్ డ్రామా!
నాగ్అశ్విన్ ‘కల్కి 2898ఎ.డి’, మారుతి ‘రాజాసాబ్’, సందీప్రెడ్డి వంగా ‘స్పిరిట్’.. ఇలా ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ తొలి కలయికలో రూపొందుతోన్నవే. ఇప్పుడీ జాబితాలో కొత్తగా హను రాఘవపూడి ప్రాజెక్ట్ వచ్చి చేరింది. ‘సీతారామం’ విజయం తర్వాత హను చేయనున్న సినిమా ఇది. ఇప్పుడాయన ప్రభాస్ కోసం చారిత్రక అంశాలతో నిండిన ఓ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేశారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మూడు పాటలు కూడా సిద్ధం చేశారు. మరి హను ఈ చిత్రంలో ప్రభాస్ను ఎలా చూపించనున్నారు.. తనతో ఎలాంటి సాహసాలు చేయించనున్నాడో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.
రవితేజ.. నానిల జోరు
ప్రస్తుతం వరుసగా కొత్త కలయికల్ని ఖరారు చేస్తూ.. సినీప్రియుల్ని ఊరిస్తున్న కథానాయకుల్లో రవితేజ, నాని ముందు వరుసులో ఉన్నారు. వీళ్లిద్దరూ కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’.. ఆ మధ్య చేసిన ‘వాల్తేరు వీరయ్య’ మినహా ఇటీవల కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ తొలి కలయికల్లో రూపొందినవే. అందులో ఇద్దరు కొత్త దర్శకుల సినిమాలూ ఉన్నాయి. ఆయన ఇప్పుడిదే పంథాలో భాను భోగవరపు అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది రవితేజకు 75వ చిత్రం. పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో లక్ష్మణ్ భేరి అనే మాస్ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించనున్నారు రవితేజ. త్వరలో సెట్స్పైకి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ దీని తర్వాత అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని తెలిసింది. ఇదీ వీళ్లిద్దరికి తొలి కాంబోనే కానుంది. ఇక నాని విషయానికొస్తే.. తను ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’తో సెట్స్పై బిజీగా ఉన్నారు. దీని తర్వాత సుజీత్ దర్శకత్వంలోనూ.. అలాగే ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండితోనూ వరుస సినిమాలు చేయనున్నారు.
మహేశ్.. అంచనాలు పెంచే కలయిక
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సాధించుకున్నారు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడాయన తొలిసారి కథానాయకుడు మహేశ్బాబుతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. దీన్ని జక్కన్న ఓ అంతర్జాతీయ సినిమాలా భారీ హంగులతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం తన లుక్ను మార్చుకునే పనిలో ఉన్నారు మహేశ్. శరవేగంగా పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్న ఈ సినిమా త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.
వీళ్లూ ఉన్నారు..
అగ్ర కథానాయకుడు బాలకృష్ణ దర్శకుడు బాబీతో కలిసి ఓ యాక్షన్ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇది ఏడాది ద్వితీయార్ధంలోనే సినీప్రియుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ స్పై థ్రిల్లర్ చేస్తున్నారు. ఇదీ తొలి కలయికనే. ఇక ఇప్పటికే పట్టాలెక్కిన పవన్ కల్యాణ్ - సుజీత్ల ‘ఓజీ’, పవన్ - క్రిష్ల ‘హరిహర వీరమల్లు’, రామ్చరణ్ - బుచ్చిబాబుల సినిమా, వరుణ్తేజ్ - కరుణ కుమార్ల ‘మట్కా’.. ఇవన్నీ కొత్త కాంబినేషన్లే. వీటితో పాటు అల్లు అర్జున్ - అట్లీ, వరుణ్తేజ్ - మేర్లపాక గాంధీ, నాగచైతన్య - కార్తీక్ దండు.. తదితర కాంబోలు సరికొత్త వినోదానికి సంకేతాలిస్తూ సినీప్రియుల్ని ఊరిస్తున్నాయి. మరి ఈ కలయికలన్నీ ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తాయన్నది వేచి చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Aamir Khan: ఆ సీన్లో నగ్నంగా నటించాను: ఆమిర్ ఖాన్
రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆమిర్ ఖాన్ చెప్పారు. -
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మమితా బైజు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రణయ విలాసం’. ఈటీవీ విన్ వేదికగా ఇది ప్రసారం కానుంది. -
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
‘పొలిమేర2’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. దీంతో నెటిజన్లు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
తండేల్ మూవీ ఓటీటీ డీల్ పూర్తయింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. -
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. -
Mahesh babu: మహేశ్ జుట్టులాగి ఆటపట్టించిన మంజుల.. క్యూట్ మొమెంట్స్ వైరల్..
ఓ పెళ్లి వేడుకకు మహేశ్బాబు హాజరుకాగా, ఆయన సోదరి మంజుల ఆటపట్టించారు.
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
పేరు ఊరిస్తోంది
విజయవంతమైన కలయికల్ని పునరావృతం చేయడమన్నది చిత్రసీమలో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ తరహావి ప్రేక్షకుల్లో అంచనాల్ని అమాంతం పెంచేస్తుంటాయి. అంతేకాదు ఇవి మార్కెట్ను బలంగా ప్రభావితం చేస్తుంటాయి. -
బంగారం అంటే మెరవాలా?
సమంత పునరాగమనం ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ఇక్కడ ఎవరికి వారే హీరో
‘‘స్వేచ్ఛ కోసం అందాన్ని సైతం ఆయుధంగా ఉపయోగించుకునే కళ ఈ బిబ్బోజాన్కు మాత్రమే తెలుసు’’ అంటూ ఇటీవలే ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని తన పాత్రను పరిచయం చేసింది అదితిరావ్ హైదరి. -
శరవేగంగా.. ‘ఐడెంటిటీ’
టోవినో థామస్, త్రిష జోడీగా అఖిల్ పాల్, అనాస్ఖాన్ తెరకెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’. ‘2018’ సంచలనం విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు త్రిష నాయిక కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. -
‘థగ్లైఫ్’ గీత రచయితగా..
అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ విలక్షణమైన నటనతోనే కాదు.. దర్శక నిర్మాతగా, స్క్రిప్ట్ రచయితగా, గాయకుడిగానూ గతంలో మెప్పించారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’తో గీత రచయితగా మరోసారి ప్రయోగం చేశారు. -
రణ్వీర్తో త్వరలోనే..
హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్వర్మ. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు. -
కథ కుదిరింది
గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు సాయిదుర్గా తేజ్. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు కొత్త కబురు వినిపించలేదు. ఆ మధ్య సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటన వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. -
థ్రిల్ ప్రాప్తిరస్తు
ప్రియదర్శి హీరోగా నటించనున్న కొత్త చిత్రం ఖరారైంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, శ్రీ వెంకటేశ్వర ఏషియన్ సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
నెగెటివ్ కామెంట్స్ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్. -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!