రూహ్బాబాతో సీనియర్ నాయికల ఆటాపాటా
కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భూల్ భులయ్యా 3’. అనీస్ బాజ్మీ తెరకెక్కిస్తున్నారు. త్రిప్తి దిమ్రి కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భూల్ భులయ్యా 3’. అనీస్ బాజ్మీ తెరకెక్కిస్తున్నారు. త్రిప్తి దిమ్రి కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో సీనియర్ నాయికలు విద్యాబాలన్, మాధురి దీక్షిత్లతో ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘‘అమి జే తోమర్’ అనే ప్రత్యేక గీతంలో విద్యాబాలన్, మాధురి ఆడిపాడనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ పాటలో రూహ్బాబా చేసే సందడి ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. రెట్టింపు వినోదంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది చిత్రబృందం’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
అందుకే సాహసాలు చేస్తా
‘‘హరి దర్శకత్వంలో ఇదివరకు ‘భరణి’, ‘పూజ’ చేశా. అవి పెద్ద విజయాల్ని అందుకున్నాయి. అదే తరహాలో ‘రత్నం’ ఓ మంచి కుటుంబ వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’న్నారు విశాల్. ఆయన కథానాయకుడిగా, హరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రత్నం’. ప్రియా భవానీ శంకర్ కథానాయిక. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 26న శ్రీ సిరి సినిమాస్ పతాకంపై సీహెచ్ సతీష్కుమార్, కె.రాజ్కుమార్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. విశాల్ మాట్లాడుతూ ‘‘నన్ను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాత బాగుండాలనేదే నా ప్రథమ కర్తవ్యం. అందుకే సినిమా కోసం సాహసాలు చేస్తూ కష్టపడుతుంటా. ప్రేక్షకుడు పెట్టే డబ్బులకి సరిపడా వినోదం ఇస్తాం. కచ్చితంగా ‘రత్నం’ పైసా వసూల్ చిత్రం అవుతుంది. ఈ చిత్రంతో అందరికీ లాభాలు వస్తాయి’’ అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో కొత్త ఓటర్లంతా తప్పకుండా పాల్గొని ఓటు హక్కుని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
సీత ఎప్పటికీ రాముడిదే
సుమన్ తేజ్, గరీమ చౌహాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద తెరకెక్కిస్తున్నారు. రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేసి సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. ‘నల్ల నల్ల నీళ్లలోనా నా తెల్లని చేప.. ’అనే నేపథ్య గీతంతో ప్రారంభమైన ఈ టీజర్.. యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘సీతమ్మ లేని గుడి రాముడి గుడే కాదు’, ‘సీత ఎప్పటికీ రాముడిదే’ అంటూ చివర్లో హీరో చెప్పిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 26న విడుదల కానుందీ చిత్రం.
ఆ అమ్మాయే పెళ్లాం అయితే..!
‘హను - మాన్’ తరహాలోనే ‘డార్లింగ్’ కూడా పెద్ద విజయం సాధించాలని, ఈ సంస్థ నుంచి మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నా అన్నారు ప్రశాంత్ వర్మ. ఆయన ముఖ్య
అతిథిగా శనివారం హైదరాబాద్లో ‘డార్లింగ్’ గ్లింప్స్ విడుదల కార్యక్రమం జరిగింది. ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటిస్తున్న చిత్రమిది. ‘..వై దిస్ కొలవెరి?’ అనేది ఉపశీర్షిక. అశ్విన్రామ్ దర్శకుడు. ‘హను - మాన్’తో విజయాన్ని అందుకున్న కె.నిరంజన్రెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. చైతన్య సమర్పిస్తున్నారు. ‘ఓ అమ్మాయి ప్రేమికురాలిగా ఉన్నప్పుడు ఎంతో అందంగా, మనల్ని అర్థం చేసుకుంటుంది. ఆ పిల్లే పెళ్లాం అయితే మన జీవితాల్ని తలకిందులు చేసి తాట తీస్తుందని’ ప్రియదర్శి చెప్పే సంభాషణతో గ్లింప్స్ సరదాగా సాగుతుంది. కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ ‘‘ప్రభాస్ అన్నని ప్రేమతో పిలుచుకునే మాట మా సినిమాకి పేరుగా పెట్టుకోవడం గర్వకారణం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మోహనకృష్ణ ఇంద్రగంటి, కరుణకుమార్, హర్ష కొనుగంటి, సునీల్ నారంగ్, గాంధీ, వివేక్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
మనసుల్ని హత్తుకునేలా కథ చెప్పాం
భావోద్వేగాల్ని ఓ సరికొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రమే మా ‘శబరి’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. ఆయన నిర్మాతగా, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత శనివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ‘‘ఒక బిడ్డ కోసం తల్లి పడిన తపనని ఆధారంగా చేసుకుని, సైకలాజికల్ థ్రిల్లర్గా ఈ సినిమా చేశాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే అంశం ఇందులో ఉంది. ఇలాంటి సినిమాల్లో కథల్ని ఎంత బాగా చెబితే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవుతుంది. మనసుల్ని హత్తుకునేలా ఇందులో కథ చెప్పాం’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి