ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి...
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ చిత్రానికి గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ అవార్డు స్వీకరిస్తూ తన సినీ జీవితంలోని ఎత్తుపల్లాల గురించి చెప్పారు కరణ్. ఆదిత్య చోప్రా, షారుక్ ఖాన్లు తన సినీ కెరీర్కి మూలస్తంభాల్లా నిలిచారని ఈ సందర్భంగా వారిద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు.
‘లవ్ మీ’ విడుదల ఖరారు
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన ‘లవ్ మీ’ విడుదల ఖరారైంది. వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. దిల్రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. బుధవారం విడుదల తేదీని ప్రకటిస్తూ, ఓ కొత్త పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం.
‘‘ఓ ఆత్మ ప్రేమకథతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు ఉన్నాయి. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, కీరవాణి సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయ’’ని సినీవర్గాలు తెలిపాయి.
ఏఐతో అట్లాస్ పోరాటం
మానవాళిని అంతం చేయాలనుకుంటోంది కృత్రిమ మేధ రోబో హార్లన్. ఆ దుష్ట పన్నాగాన్ని అడ్డుకునే మిషన్ని తలకెత్తుకుంటుంది అత్యంత తెలివైన డేటా ఎనలిస్ట్ అట్లాస్ షెఫర్డ్. ఆమెకు అండగా మరో ఏఐ స్మిత్ బయల్దేరతాడు. కృత్రిమ మేధపై ఏమాత్రం నమ్మకం లేని అట్లాస్ అపనమ్మకంతోనే స్మిత్తో కలిసి పోరాటం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో వాళ్లు అనుకున్న లక్ష్యం చేరుకున్నారా? అంటే ‘అట్లాస్’ చూడాల్సింది. అందాల నాయిక, గాయని జెన్నిఫర్ లోపెజ్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న హాలీవుడ్ చిత్రమిది. బ్రాడ్ పేటన్ తెరకెక్కిస్తున్నారు. హార్లన్ అనే ప్రతినాయకుడి పాత్రని సిము లియూ పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ఏజెంట్ అట్లాస్ షెఫర్డ్.. హార్లన్ అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను వేటాడుతూ తన జీవితాన్ని త్యాగం చేసింది’, ‘హార్లన్ను నిజంగా పట్టుకోవాలనుకుంటే ఈ రహస్య మిషన్లో నేను భాగం కావాల్సిందే. నా శక్తియుక్తుల్ని వాడాల్సిందే’’ లాంటి సంభాషణలతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది ఈ ట్రైలర్. ప్రధానంగా దుష్ట ఏఐ నుంచి మానవాళిని రక్షించడానికి అట్లాస్ షెఫర్డ్ చేసే సాహసాలు ఇందులో చూపించారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మే 24న నెట్ఫ్లిక్స్లో విడుదలవుతోంది.
సేతుపతి కుటుంబ వినోదం
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మరో కొత్త సినిమాకు సంతకం చేశారు. తన తదుపరి ప్రాజెక్టుకు పాండిరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు సన్నిహితవర్గాలు తెలిపాయి. విజయ్ సేతుపతి ప్రస్తుతం ‘మహారాజా’, ‘విడుదలై 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
నాన్నే హీరో
శివాజీరాజా ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘నాన్నా మళ్ళీ రావా..!’ నిర్దేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.ఉమామహేశ్వరరావు నిర్మాత. ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో జరిగింది. టి.ప్రసన్నకుమార్, బాబ్జీ, వై.సురేందర్రెడ్డి, నరేశ్ వర్మ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నటుడు శివాజీరాజా మాట్లాడుతూ ‘‘కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రమిది. భావోద్వేగాలు మిళితమైన ఈ తరహా సినిమాలు అరుదుగా వస్తుంటాయి. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంద’’న్నారు. ‘‘ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన సూపర్ హీరో అంటే నాన్నే. వెంకన్న అనే ఓ తండ్రి పాత్రే నాతో ఈ కథ రాయించింది. ప్రతి ఒక్కరిలోనూ భావోద్వేగాలు నింపే చిత్రమిది’’ అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో రోసిరెడ్డి, సినిటేరియా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే