నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది.
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే గెటప్ శ్రీను తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ‘‘రాజు యాదవ్’ ట్రైలర్ చూశాను. దీంట్లో శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, కంటతడి పెట్టిస్తుంది. ఈ చిత్రం ద్వారా శ్రీను హీరోగా అందరి మన్ననలు అందుకుంటాడని ఆశిస్తున్నా. చిత్ర బృందానికి నా అభినందనలు’’ అని చిరు ఒక వీడియోలో అభినందించారు.
ఏస్ గేమ్ ఛేంజర్
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తన 51వ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అర్ముగ కుమార్ దర్శకనిర్మాణంలో తమిళంలో తెరకెక్కనుందీ సినిమా. ఈ సినిమాతో కన్నడ భామ రుక్మిణీ వసంత్ తమిళ పరిశ్రమలో అడుగు పెట్టనుంది. తాజాగా ఈ సినిమాకి ‘ఏస్’ (ఏసీఈ) అనే టైటిల్ని ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది రుక్మిణి. ‘ఇది కేవలం సాధారణ కార్డ్ మాత్రమే కాదు..గేమ్ ఛేంజర్ కూడా’ అనే వ్యాఖ్యల్ని జోడించింది. పూర్తిస్థాయి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో జూదం ఆట కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచార చిత్రాన్ని చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో యోగిబాబు, పృథ్వీరాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించునున్నారు.
కశ్మీర్లో సింగమ్ యాక్షన్
‘‘సింహం బీభత్సం సృష్టిస్తుంది. గాయపడిన సింహం విధ్వంసం సృష్టిస్తుంది’’ అంటూ ఇటీవలే తన రాబోయే ప్రాజెక్టు ‘సింగమ్ అగైన్’ను పరిచయం చేశారు కథానాయకుడు అజయ్ దేవగణ్. ఆయన.. అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రమిది. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాజీరావ్ సింగమ్గా కనిపించనున్నారు అజయ్. తాజాగా కశ్మీర్లో ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘‘ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అజయ్, జాకీ ష్రాఫ్ మధ్య ముఖ్యమైన సన్నివేశాలను కశ్మీర్లో తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు ఈ ప్రాజెక్టుకే ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి’’ అని సన్నిహితవర్గాలు తెలిపాయి. కరీనా కపూర్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చందు కాదు.. ఛాంపియన్
‘‘ఛాంపియన్ కావాలని కలలు కన్న నాలాంటి ఎంతో మంది చందుల కోసం నేను ఈరోజు కచ్చితంగా పోరాడాలి’’ అంటూ ‘చందు ఛాంపియన్’ ప్రపంచాన్ని పరిచయం చేశాడు కార్తిక్ ఆర్యన్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్నారు. భారతదేశం నుంచి తొలి పారాలింపిక్ గోల్డ్ మెడల్ సాధించిన స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను ఇన్స్టా వేదికగా విడుదల చేశాడు కార్తిక్. ‘‘భారతదేశం గర్వించదగిన వ్యక్తి మురళీకాంత్ జీవిత ప్రయాణం లక్ష్యాలను సాధించడంలో మిమ్మల్ని ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాన’’ని వ్యాఖ్యల్ని జోడించాడు. చిన్నప్పటి నుంచే ఛాంపియన్గా ఎదగాలనే కోరికతో పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం కోసం హీరో ఎదుర్కొన్న సవాళ్లను, అవమానాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది ఈ ట్రైలర్. ‘చందు కాదు.. ఛాంపియన్’’ లాంటి డైలాగులు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట